పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/321

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

268

మహాపురుషుల జీవితములు



ముగ రావించి సెలవుదినములలో ననేకవిషయములను గూర్చి వానితో జర్చింపుచు వచ్చిరి.

ఆ దినములలో హైకోర్టులోఁ దర్జుమాదారుగ నున్నవారి కిప్పటివలె జీతమిచ్చుటగాక తర్జుమాచేసిన కాగితములకు రుసుము ముట్టుచు వచ్చినందునను రంగనాథునకుఁ జాల భాషలలోఁ బ్రవేశ ముండుటచేత నెలకు రమారమి రు. 2500 లు వానికివచ్చు బడి యుండెను. అప్పటికతనికి సంస్కృతమునందుఁ బాండిత్యము పరిపూర్ణమగుటచే హైకోర్టులో హిందూధర్మశాస్త్ర విషయములుగల వ్యాజ్యములన్నిటిలోను జడ్జీలు వాని యాలోచనమును ముఖ్యముగ గ్రహించుచు వచ్చిరి. 1857 వ సంవత్సరమున జెన్నపట్టణపు యూనివర్సిటీస్థాపింపబడినప్పుడు రంగనాథుఁ డొక ఫెల్లోయయ్యెను. 1859 వ సంవత్సరమున సర్. చార్లెసు ట్రెబిలియన్ దొరగారు చెన్నపట్టణపు గవర్నరుగా వచ్చినప్పుడు కొందఱుదొరలు రంగనాథశాస్త్రిని దీసికొని స్వదేశస్థులలో గౌరవనీయుఁడని గవర్నరుగారికిఁ బరిచితునిఁ జేసిరి. ఆదినము మొదలు గవర్నరుగారు రంగనాథశాస్త్రి సామర్థ్యము మెచ్చుకొని వానిం దరుచుగ దనమందిరమునకుఁ బిలిచి హిందువుల సంఘస్థితినిగూర్చి పలుమారు వానితో జర్చించుచు వచ్చెను.

1859 వ సంవత్సరముననె చెన్నపట్టణము స్మాలుకాజుకోర్టులో నొకజడ్జీపని కాళీవచ్చెను. అది రంగనాథశాస్త్రికిచ్చిన బాగుండునని కొందఱనిరి. స్వదేశస్థుడగుటచే నతనికీయగూడదని దొరలందఱు గంఠోక్తిగ వాదించిరి. కాని గవర్నరుగారు తెల్లవారి యాలోచనలు వినక యాయుద్యోగము రంగనాథునకే యిచ్చెను. ఆపనిలో నతఁడు చూపిన చాకచక్యమునుబట్టియు సామర్థ్యమునుబట్టియు మొదట నతఁడనర్హుడనివాదించుచున్న వారు సిగ్గుపడవలసివచ్చెను. పట్టణమందెచ్చట విన్నను రంగనాథుని యద్భుతశక్తి వర్ణనములే వినంబడుచు