కొలనుపాక - శాసనములు
1. ఇద్దరు రాజులచేత ఇవ్వబడిన శాసనమిది. కళ్యాణి చాళుక్య వంశమునకు చెందిన త్రిభువన మల్లదేవుడు (క్రీ.శ. 1076 - 1127) శ్రీ జగదేక మల్లుడు (క్రీ.శ. 1015 - 1043) ఇచ్చిన దాన శాసనమిది. ఇందు వీరిరువురు, జైన మతాచార్యుడైన చంద్ర సేనాచార్యునకు కొంత భూమిని దానముగా నిచ్చినటుల తెలుపుచున్నది. శ్రీ చంద్ర సేనాచార్యులవారు బహుశః కొలనుపాక యందలి జైన దేవళమునకు ఆచార్యుడై యుండ వలయును.
2. ఇది ఆరవ విక్రమాదిత్యుని క్రీ.శ 1099 కాలమునాటి శాసనము. విక్రమాదిత్యుని 22 వ రాజ్య సంవత్సరమున చేయ బడిన ఒక దాన శాసనము.
3. మూడవ తైలవుడు (క్రీ.శ. 1151 - 1156) చాళుక్యవంశజుడు ఇచ్చిన శాసనము.
4. రెండవ తైలవుడు (క్రీశ.990) నాటి శాసనము.
5. త్రిభువన మల్ల దేవుని శాసనము. (క్రీ.శ. 1076 - 1127) కన్నడ లిపి యందు కలదు. ఈ శాసనమునందు కుమారసోమేశ్వరుని వివిధబిరుదులను అభివర్ణించి అతను కొంతభూమిని సోమేశ్వరస్వామివారికి దానముచేసినటుల తెలుపుచున్నది.
6. కళ్యాణి చాళుక్యుల కాలమునాటి సంస్కృత శాసనము.
7. త్రిభువనమల్లదేవుడు (క్రీ.శ. 1076 - 1127) (చాళుక్యవంశజుడు) కొన్ని పన్నులవలన వచ్చు రాబడిని కొలనుపాక యందలి ఒక రెడ్డికి దానముచేసినటుల తెలుపు చున్నది.
8,9. తైలవుడు (క్రీ.శ. 973-997) ఇచ్చిన ఒక దాన శాసనము.
10. త్రిభువనమల్లుని (క్రీ.శ. 1076-1127) యొక్క మరియొక శాసనము.
11. కాకతీయరుద్రదేవుని సంస్కృత శాసనము. కాకతీయరుద్రదేవుని భృత్యుడొకడు కొల్లిపాకయందలి స్వయంభూ మాణిక్యతీర్థులవారికి నిత్యము రెండుపూటల జరుగవలసిన ధూప, దీప, నైవేద్యముల కగు ఖర్చునిమిత్తమై ఇచ్చిన దానమును సూసించుచున్నది.