పుట:Dvipada-Bagavathamu.pdf/208

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

164

ద్విపదభాగవతము

దిలకించు చందన తిలకంబు లలర
కలికెలు మేన నుత్కలికలై తనర80
వనములు నిత్యయౌవనలక్ష్మిఁ జెంది
వనితలచందమై వలనొప్పుఁ జూడ
నీభంగి నామని యేపార సీరి
యాభీరుకాంతల నాత్మలోఁదలఁచి;
 

బలరాముఁడు వ్రేపల్లెకు నరుదెంచుట


హరికి నెఱింగించి యట రథంబెక్కి
యరుదెంచె వ్రేపల్లె కాప్రొద్దె కదలి
ఏపారఁ జనుదేర నెదురేఁగి యంత
గోపయశోద లక్కునఁ జక్కఁజేర్చి
“నాతండ్రి! నాయన! నాముద్దుకూన!
ఏతెంచితే మమ్ము నిందఱుఁ జూడ
దేవకియును వసుదేవుఁడు హరియు
నీవు రోహిణి నెమ్మి నెలతలు సుఖులె?”
అని ప్రేమ నడుగుచు నర్మిలి పుత్రుఁ
గనుఁగొని హర్షాశ్రుకణములు దొరగ
సంతసింపుచునుండ సకలగోపికలు
నంతలో నరుదెంచి హలపాణిఁ గాంచి
సేమంబుఁ జెప్పి తత్సేమంబు లడిగి
యామోహరసవార్ధి నందందతేలి
హలియు మజ్జనఁ భోజనాది కృత్యములు
సలిపి వారునుఁ దాను సంతోషలీలఁ90
గలసి వినోదించి కాళిందితీర