పుట:Dvipada-Bagavathamu.pdf/179

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కల్యాణకాండము

135

గూరుకుఁ గానక కొందలమందు.
ఈ భంగి మదనాగ్ని నెరియుచునున్న
నాభామచెలియ కుంభాండునిపుత్రి
చిత్రరేఖనుపేరఁ జెన్నారు లేమ
మైత్రి వాటించి యమ్మగువకిట్లనియె.

చిత్రరేఖ ఉషాకన్యను నూరార్చుట


“ఇదియేమి నీచంద మెలదీగబోఁడి?
మదిలోన నీకింత మరుఁగనేమిటికి?
ఏల చింతించెదవేల మూర్ఛిల్లి
యేలనారటఁ బొందెదిభరాజగమన?
పురుషుఁడు నీతోడ భోగించినట్టి
మురిపంబుదోఁచె నీమోముదామెరను
బొరిఁ బోతుటీఁగకుఁ బొలియంగరాని
వర హార్మ్యమునకు నెవ్వఁడు వచ్చెనబల?
పడుచుకూఁతుర! ఇట్టిపని యెట్లువుట్టె?
ఎడసేసి నాకేల యెఱిఁగింపవైతి?
ఎవ్వనిఁగనుఁగొంటి వెవ్వనిబొంది
తెవ్వఁడు సేసె నేఁడీసాహసంబు?810
వనిత! నీమదిలోని వగపెల్లఁదీర్తు
నను వింత సేయక నాకెఱిఁగింపు”
మనిన నెచ్చెలిఁజూచి హరుషంబు సిగ్గు
ననుకంపయును దోప నయ్యింతిపలికె.