పుట:Dvipada-Bagavathamu.pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

112

ద్విపదభాగవతము

నత్యుదాత్తత సుఖంబందె మురారి

శ్రీకృష్ణుఁడు భద్రను లక్షణను వివాహమాడుట


పూని కేకయరాజపుత్రిని భద్ర
మేనత్తకూఁతు నర్మిలిఁ బెండ్లియయ్యె.
మరి స్వయంవరమున మద్రేశతనయ
నరమి లక్షణఁ బెండ్లియయ్యె మురారి.
వఱలు రుక్మిణి జాంబవతి సత్యభామ
మెఱయు కాళిందియు మిత్రవిందయును
సత్యయు భద్రలక్షణయును ననఁగ
నత్యుదాత్తత భామలయ్యెనమండ్రు
పట్టపుదేవులై భాసిల్లుచుండ
నెట్టన నరకుని నిర్జించి శౌరి
వెలఁతుల పదియాఱువేలను దెచ్చి
యెలమి పెండ్లయ్యె నంచిట్లు సెప్పుటయు;
నరకుఁ డెవ్వఁడు? వాని నలినాక్షుఁ డేలఁ
బరిమార్చె? నెక్కడి పడఁతులు వారు?
ఈ కథ నెఱిఁగింపుమని వేఁడుటయును
జేకొని శుకయోగి చెప్పంగఁ దొడఁగె.550

నరకాసురుని వృత్తాంతము


ధరణీసుతుఁడు నుద్ధత బాహబలుఁడు
నరకాహ్వయుండు దానవకులేశ్వరుఁడు
వరశక్తి మహిమ దుర్వారసత్వమున
ధరణిపైఁ గల రాజతతి నెల్ల నోర్చి