పుట:Dvipada-Bagavathamu.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

66

ద్విపదభాగవతము

విడుతుఁ బ్రాణంబులు వేరొండు లేదు!”
అనిన నావిప్రుఁడు నతివచోధనుఁడు

పురోహితుఁడు శ్రీకృష్ణుని వద్దకు వెళ్లి రుక్మిణి ప్రేమను రూపును వర్ణించుట


జనియె సత్వరమున శౌరిసన్నిధికి
అరుదార ద్వారపాలావళిచేత
హరి విని యెదుఱేఁగి యా విప్రవరునిఁ20
దోడ్కొనిపోయి సంతుష్టుఁ గావించి
వేడ్క ప్రియంబును వెలయ నిట్లనియె.
“ఎవ్వరు బుత్తెంచి రెందుండి వచ్చి
తెవ్వరు నీనామ మెఱిఁగింపు” మనిన
“అనఘాత్మ! భీష్మకుండను విదర్భేశు
తనయ రుక్మిణియను ధవళాయతాక్షి
[1]తనుమధ్య యుత్ఫుల్ల తామరసాక్షి
గరుడకిన్నెరయక్షగంధర్వసతులు
దొరయలే రాయింతితో నీడుఁ బోల్ప;
దేవర సౌభాగ్యదివ్యవర్తనలు
వావిరి జనులెల్ల వర్ణింపుచుండ
విని పుష్పధన్వుని విషమబాణములు
యనువొందఁ దనువున నటనాటుటయును
జిత్తంబులో నీదు చెలువైనమూర్తి
చిత్తరువొత్తిన చెలువంబుఁదోఁపఁ
జింతించు వెఱఁగందు చేష్టలు మఱచు

  1. ఒకేపాదమున్నది.