30
ఢిల్లీ న గ ర చరిత్రము.
యాయాచోట్ల స్తంభమును జుట్టినచ్చు విశాలములగు • సజ్జ'*[1]
(Balconies) లమర్పఁబడినవి. సజ్జలకు మధ్యప్రదేశము
'నందలి స్తంభోపరి భాగము కోణాకృతులును(angular)వలయా
కృతులును నై పరస్పరానువ గులగు పట్టెలతో శోభిల్లు
చున్నది. ఈ పట్టెలమీఁదఁ జూచువారల సనిమిషులం జేయ
గలుగునంతటి చిత్రమగు చెక్కడవుపని చేయఁబడి యున్నది.
భారతవర్ష శిల్పి కాచరిత్రను రచించిన "ఫెర్గుసనను ప్రసిద్ధ గ్రంథ
కారుఁడిద్దానిని గుఱించి " ఈ జాతి కట్టడములలో నింత సౌం
దర్యము గల దిం కెచ్చటను లేదని చెప్పుటలో నేమాత్రమును
“నతిశయోక్తి లేదని వ్రాసియున్నాఁడు.
కుతుబ్ మసీదు.
కుతుబ్ మీనారున కనతి దూరమున కుతుబుద్దీను వలన నిర్మింపఁబడిన ప్రాచీనమగు మసీదొకటిగలదు.దీనికి కుతుబ్ మసీదనియు కుడత్ -ఉల్- ఇస్లామ్' అనియు పేర్లు. "రెండవ "దానికి 'ముసల్మానుల ధర్మపుశక్తి ' అనియర్ధము. ఈ మసీదు 150
.......................................................................................................
- ↑ మద్రాసునందు లైట్ హౌసు పై కెక్కి.. దీపముండు అరను చేరిన తరువాత, జనులు చుట్టుంగల. నగరప్రదేశమును జూచుటకయి ఆ అరనుండి బయటికి వచ్చి "నిలచుటకు ఆ ఆరచుట్టును గొంచెము 'వెడలుపు; లైట్ హౌ సను స్తంభమునుండి నిక్క పొడుచుకొనుచున్నదో నాఁ దోపింప జేయు బయలు ఆటక వేయఁబడినది. దాని చివర రక్షణార్ధము కమ్ములతోఁగ టక మమర్పఁబడినది. ఈ విధమగు శిల్పములకు సజ్జలని పేరు,