పుట:Delhi-Darbaru.pdf/339

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హోయసణులు

313


నని యున్న విగాని వీరబళ్లాళుఁడు యాదవులనుండి కొనిన ప్రదే శము మఱల వారికిఁ జెందినట్లు వారి సేనానుల వాక్కులవలన దెలియుచున్నది. అయిన సోమేశ్వరుఁడు దక్షిణమున స్వతంత్రుఁ డు చోళ రాజ్యములోని విక్రమపురమునందు నినసించు చుండెను.

హొయిసణులు పాండ్య రాజ్య విధ్వంసకులుగను చోళ రాజ్యసహాయులుగను వర్ణించు కొనుటచే, చోళులకును వీరికినీ మిక్కిలి మక్కువ యుండినట్లూహింపవలసి యున్నది. ఈసోమే శ్వరున కిద్ఱు కుమారులు. ఇతని మరణముతో వారిరువురును రాజ్యమును పంచుకొనిరి. మూఁడవనరసింహుఁడు ద్వార సముద్ర మునను 'రామనాథుఁడు దక్షిణమున అరవ దేశమునను పరిపాలిం చుచుండిరి. వీరి కాలము శాంతిమయియే జరిగిపోయెను. నరసిం హుని కుమారుఁడు మూఁడవ బళ్లాళుఁడు రాజ్యమునకు వచ్చిన తరువాత రెండుగా జీలిపోయిన హోయిసణరాజ్యము మఱల నెక్కటి యయ్యెను. కాని యతనికిఁ బ్రబలవిరోధులు గనుపిం చిరి. 1810 వ సంవత్సరమున అల్లాఉద్దీన్ సేనాని మాలిక్ కాఫుర్ దండెత్తివచ్చి ద్వార సముద్రమును ముట్టడించి రాజును పట్టుకొని పట్టణము కొల్లగొట్టి మోయ లేనంత సువర్ణ మును 'బట్టించుకొని వెడలి పోయెను. నరసింహుఁడు రాజధానిని మఱలఁ గట్టనారంభించెనుగాని మఱియొక మహమ్మదీయ సేనాని వలన నది 1326లో పూర్తిగ నశింపు చేయఁబడెను. ఇంతటితో