పుట:Chatu Padya Ratnakaramu - Deepala Pichchayya Sastry.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

34

చాటుపద్యరత్నాకరము

అది విని రాజుగారు “పండితవర్యా! తమ రట్లు సెలవీయనగునా? తమవంటిపండితులచేఁ బరిశీలింపఁబడనియెడల నీగ్రంథమునకు ఘనత యెట్లువచ్చును” అని యెన్నోవిధములఁ బ్రార్థించెను. “పరిశీలింపుడని మీరు నన్నుఁగోరిన గ్రంథకర్త యంగీకరింపవలయుఁ గదా?” యని లక్ష్మణకవి పలికెను.

ఆపలుకులు విని కృష్ణకవి యాగ్రహించి “మహారాజా! యీస్థానములో లక్ష్మణకవినిఁ బండితుఁడనుట హాస్యాస్పదము. అదియుఁగాక యీపండితసభలో ‘నేనొకపండితుఁడ’ నని యాతఁడొప్పుకొనుట మిగుల నవ్వులచేటు” అనుచు “నాగ్రంథమునఁ దప్పుఁబట్టఁగలవాఁడే యుండిన, నతఁడు లక్ష్మణకవికన్యుఁడు గాని, లచ్చనగాఁ” డని తిరస్కరించెను. లక్ష్మణకవి కృష్ణునిపలుకులు వినివిని కృష్ణకవి నింకను నుడికించినంగాని కార్యము కాదని చిఱునవ్వు నవ్వుచు రాజువంకఁ దిరిగి యటనుండు నొకకుక్కంజూచి


   “ఈశునకము కృష్ణమూర్తియే యెన్నంగన్”

అని యూరకుండెను. ఆమాటవిని కృష్ణకవి మండిపడి

క. “దాశరథీశబ్దంబును
   దాశరథిపరమ్ముఁ జేయుద్వైయర్థికి దు
   ర్ధీశక్తిబిడాలమునకు
   నీశునకము కృష్ణమూర్తియే యెన్నంగన్.

అని పద్యమును బూరించి లక్ష్మణకవి యొకచోఁ బ్రయోగించిన దాశరథీశబ్దప్రయోగము నాక్షేపించెను. యుక్తిశాలియగు