ప్రశ్నలు
1.ఈసాకుని బలిగా సమర్పించడంలో అబ్రాహాము ప్రదర్శించిన విశ్వాసాన్ని తెలియజేయండి.
2.స్త్రీలోలుడైన సంసోను పతనమైన తీరూ, అతడు తన మరణానికిముందు శత్రువులను నాశంజేసిన తీరూ వివరించండి.
3.ప్రభువు సమూవేలుని పిల్చినతీరూ, దానినుండి మనం నేర్చుకోదగ్గ పాఠలనూ వివరించండి.
4.ప్రభువు అవిధేయుడైన సౌలుని రాజపదవినుండి త్రోసివేసిన తీరును వివరించండి.
5.సమూవేలు దావీదుకి అభిషేకం చేసిన తీరును వివరించండి. నేడు మనం మన పిలుపనీ సేవనూ లోతుగా అర్థంజేసికోవడానికి ఈ సంఘటనం ఏలా తోడ్పడుతుంది?
6.దావీదు గొల్యాతుల కథలో మానుషబలం దైవబలానికి లొంగిపోయిన తీరును వివరించండి. ఈ కథ నేడు మనకు కలిగించే ప్రేరణలను కొన్నిటిని తెలుపండి.
7.దావీదు దేవునికి మందిరం కట్టగోరిన తీరూ, దేవుడే దావీదుకి మందిరం కట్టిపెట్టినతీరూ వివరించండి.
8.దావీదు పాపంచేయగా నాతాను అతన్ని మందలించిన తీరును వివరించండి. ఈ కథ నేడు మనకేలా ప్రేరణం పట్టిస్తుందో తెలియజేయండి.
9.సాలోమోనుకు విజ్ఞానవరం ఏలా లభించింది? ఆ వరం అతనిలో ఏలా పనిచేసింది?
10.అహీయా ప్రవచనాన్ని వివరించండి. రెహబాము కాలంలో రాజ్యవిభజనం ఏలా జరిగిందో తెలియజేయండి.
11.ఏలీయా ప్రవక్త సారెఫతు వితంతువునీ ఆమె కుమారుడ్డీ ఆదుకొన్న తీరు వివరించండి.
12.కర్మెలు కొండమీద బాలుమతానికీ యావే మతానికీ జరిగిన పోటీని వివరించండి.
13.ఏలీయాకు హోరేబు కొండమీద కలిగిన దైవానుభూతిని వివరించండి. ఈ కథ నేడు మనకు ఏలా ప్రేరణం పట్టిస్తుందో తెలియజేయండి.
14.అహాబు నాబోతు ద్రాక్షతోటను అపహరించిన తీరూ, ఏలీయా ఆ అన్యాయాన్ని ఖండించినతీరూ వివరించండి. 15.ఏలీయా స్వర్గానికి పోయినతీరూ ఏలీషా అతనికి వారసుడైన తీరూ వివరించండి.
16.ఎలీషా నామాను కుష్టను నయంజేసి అతనికి రోగవిముక్తిని కలిగించిన తీరును వివరించండి. లేదా "నామాను విశ్వాసం మెచ్చుకోదగ్గది" - వివరించండి.
17.సౌలుకు డమస్కదర్శనం ఏలా కలిగింది? దానివల్ల అతడు క్రొత్తగా గ్రహించిన వేద సత్యాలేమిటివి?