పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/295

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆత్మ ప్రబోధాన్ని గుర్తించినంక ఆ ప్రబోధం ప్రకారం నడచుకోవాలి. స్వర్గస్టులైన 23వ జాన్ పోపుగారు క్రైస్తవ మహాసభ జరిపించాలి అనే ప్రబోధాన్ని హృదయంలో గుర్తించారు. వెంటనే ఆయన రెండవ వాటికన్ సభను సమావేశపరచాడు. ఈ సభ వలన కల్గిన మేళ్లు అన్ని యిన్నికావు. మొదటి పెంతెకోస్టు తర్వాత ఈ రెండవ వాటికన్ వంటి క్రైస్తవ సంఘటనం మరొకటి జరగలేదని చాలామంది విజ్ఞల అభిప్రాయం. జాన్ పోపుగారు వాటికన్ సమావేశ ఫలితాలను కన్నులార చూడకముందే కన్నుమూసారు. కాని నేడు మనం ఆ సత్ఫలితాలను అనుభవిస్తున్నాం. ఈ జాన్ పోపుగారివలె మనం కూడ ఆత్మ యిచ్చే ప్రబోధాలను పాటించడం నేర్చుకోవాలి. “ఈ దినం మీరు ప్రభువు పల్మలు ఆలించినటైతే ఎంత మేలయ్యేది! ఆనాటి మీ పితరుల వలె నేడు మీరు కూడ హృదయం కఠినపరచుకోకండి" అంటుంది కీర్తన 95,7. ఈ వాక్యాలు ప్రతిరోజు స్మరించుకోదగ్గవి.

ప్రార్ధనా భావాలు

1. మూడవ శతాబ్దానికి చెందిన క్లెమెంట్ అనే వేదశాస్త్రి యీలా వ్రాసాడు. "మొక్కలను మడిలో నుండి పెరికి తోటలో నాటుతారు. అక్కడవి బాగా పెరుగుతాయి. మనతోట క్రీస్తే మనలను పూర్వపు పాపజీవితంనుండి పెరికివేసి క్రీస్తు అనే మంచి నేలలో నాటుతారు. క్రీస్తు అనే తోటలో మనం చక్కగా ఫలిస్తాం." అనగా క్రీస్తు వరప్రసాదం మన మీద పనిచేసి మనం దివ్యజీవితం జీవించేలా చేస్తుందని భావం.

2. మనం వరప్రసాదంతో సహకరించాలని చెపూనాల్గవ శతాబ్దానికి చెందిన జెరోము భక్తుడు ఈలా వ్రాసాడు. “అడగడం మన పని, ఈయడం దేవుని పని. కార్యాన్ని మొదలు పెట్టడం మన పూచీ, దాన్ని ముగించడం దేవుని పూచీ, మనకు చేతనైంది మనం చేస్తే, మనకు చేతకానిది దేవుడే చేస్తాడు." కనుక మన మెప్పడుకూడ దేవుని వరప్రసాదంతో సహకరించి సత్కార్యాలకు పూనుకోవాలి.

3. బావిలో నీరు చేదుకోవడానికి వచ్చిన సమరయ స్త్రీతో క్రీస్తు"నేను నీకు జీవజల మిస్తాను" అని చెప్పాడు. ఈ జలం అంతరంగమనే చెలమనుండి ఉబికి వస్తుందనీ, దాని ద్వారా శాశ్వత జీవం పొందవచ్చుననీ చెప్పాడు - యోహా 4, 14. బైబుల్లో జలం ఆత్మను సూచిస్తుంది. క్రీస్తు ఉత్తానమయ్యాక తన ఆత్మను మనకు అనుగ్రహిస్తాడు. ఈ యాత్మ ద్వారా మనకు వరప్రసాదం లభిస్తుంది. అనగా ఉత్థాన క్రీస్తు ఆత్మ మన ఆత్మలో వుండి మన అంతరంగంలో వరప్రసాదాన్ని ఊరినూంటుంది. చెలమలోనుండి నీళ్ళు వుబికి వచ్చినటుగా మన అంతరంగంలోనుండి వరప్రసాదం ఉబికి వస్తూంటుంది.