అంతరాత్మలో వసించే యీ దివ్యాత్మ మనకు వరాలనిస్తుంది. దైవప్రేమ, సోదరప్రేమ మన హృదయాల్లో కుమ్మరిస్తుంది. దేవునితో తండ్రితోలాగ సంభాషించి ప్రార్ధనం చేయడం నేర్పుతుంది. మన హృదయాలను వెలిగిస్తుంది - హెబ్రే 6,4
క్రీస్తు కృప, తండ్రి ప్రేమ, ఆత్మ సహవాసం కొరింతీయులతో వుండాలని దీవించాడు పౌలు - 2కొ 13,13. దైవవ్యక్తులు మువ్వరూ విశ్వాసుల హృదయాల్లో వసిస్తూంటారని భావం, మనం పైన పేర్కొన్న అంశాలన్నీ ఈ వాక్యంలో సంగ్రహంగా ఇమిడే వున్నాయి.
4. అంతర్నివాస ఫలితాలు
జ్ఞానస్నానం ద్వారా పితకు పత్రుల మౌతాం. అంతర్నివాసం ద్వారా ఈ పత్రత్వం బలపడుతుంది. ఆ పరలోకపు తండ్రిలాగే మనమూ నాడునాటికి పరిపూరులంగా మంచివాళ్ళంగా తయారౌతాం - మత్త 5,48. కడన పిత మనలను తన దివ్యరాజ్యంలోనికి చేర్చుకుంటాడు — లూకా 12,32.
జ్ఞానస్నానంద్వారా క్రీస్తుకు తమ్ముళ్ళమూ, చెల్లెళ్ళమూ ఔతామన్నాం. క్రీస్తు అంతర్నివాసం ద్వారా మన యీ సోదరత్వం బలపడుతుంది.
మోషే యిప్రాయేలు ప్రజలకు నాయకుడై వారిని ఐగుపునుండి వాద్దత్తభూమికి నడిపించుకొని వెళ్ళాడు. క్రొత్త యిస్రాయేలీయులమైన మనలను క్రీస్తు నాయకుడు పరలోకంలోని పితసాన్నిధ్యానికి నడిపించుకొని వెళ్తాడు.
ఈ లోకంలో వున్నంతకాలం మనం క్రీస్తుద్వారా పితను ఆరాధిస్తుంటాం. మన ఆరాధనమంతా ప్రధాన యాజకుడైన క్రీస్తుద్వారా పితను కొలవడమే. కట్టకడన క్రీస్తు ఈ క్రైస్తవ సమాజాన్నంతటినీ పిత చేతులలోనికి అప్పగిస్తాడు. అపుడు విశ్వాసులందరు దేవునియందు, దేవుడు విశ్వాసులందు శాశ్వతంగా వసిస్తారు - 1కొరి 15, 27-28.
జ్ఞానస్నానంద్వారా పరిశుద్దాత్మ మనలను ఆధ్యాత్మిక మానవులను చేస్తుంది. ఆత్మ అంతర్నివాసం ద్వారా ఈ యాధ్యాత్మిక జీవనం బలపడుతుంది. పూర్వవేదపు యూదులు రాతిపలకమీద వ్రాయబడిన పది యాజ్ఞలను పాటించారు. నూత్న వేద ప్రజలమైన మనం ఆత్మ యిచ్చే అంతరంగిక ప్రబోధాలను పాటిస్తాం. ఆధ్యాత్మికమైన దివ్యజీవితం జీవించడానికి వలసిన శక్తినిగూడ ఆత్మ ప్రసాదిస్తుంది. తన వెలుగుతోఓదార్పుతో సదాలోచనతో మనలను ముందంజ వేయిస్తుంది. మన ఆధ్యాత్మిక జీవితం విశేషంగా పాపనాత్మమీద ఆధారపడివుంటుంది. దేవుని పుత్రులు ఎప్పడూ ఆ యాత్మచేత నడిపింపబడుతూంటూరు.