ఈ పుట అచ్చుదిద్దబడ్డది
1. అన్నలు యోసేపును బానిసగా అమ్మివేసారు. ఐగుప్తదేశంలో ఫరోరాజు సైనికోద్యోగియైన పోతీఫరు అతన్ని కొన్నాడు. ఆ సైనికోద్యోగి యింటిలో యోసేపు మన్ననపొందాడు. కాని అతని భార్య మూలకంగా చెరలో త్రోయబడ్డాడు. ఐనా యోసేపుకు ప్రభువు తోడ్పడ్డాడు. చెరసాల అధికారికి అతనిమీద దయపట్టింది. యోసేపు దైవశక్తివలన తనతోపాటు చెరలోవున్న వంటలవాని కలకూ పానీయవాహకుని కలకూ వివరణం చెప్పాడు. అది తెలిసికొనిఫరోచక్రవర్తికూడ అతనితో తన కలలకు అర్థం చెప్పించుకొన్నాడు. ఫరో యోసేపును మెచ్చుకొని అతన్ని ఐగుప్న దేశాని కంతటికీ సర్వాధికారినిగా నియమించాడు. ఈ విధంగా ఒక హీబ్రూ బానిస గండాలన్నీ తప్పించుకొని ఐగుప్తుకు ప్రధానమంత్రి కాగలిగాడంటే అది భగవంతుని తోడ్పాటువలననే గదా! - ఆది 39, 2.
2. యోసేపు ఐగుప్తున మంత్రిగా వుండగా ప్రపంచమంతటా దారుణమైన కరువు వచ్చింది. అతని సోదరులు కనాను మండలంలో మలమల మాడి చస్తున్నారు. కాని యోసేపు బుద్ధికుశలతతో ఐగుప్శన ముందుగానే ధాన్యం సేకరించి వుంచాడు. యోసేపు సోదరులు ధాన్యం కొనితెచ్చుకోవడానికి ఐగుప్తుకు రెండుసార్లు వెళ్ళారు. రెండవసారి వాళ్ళ యోసేపు తమ్మ శిక్షిస్తాడేమోనని భయపడిపోయారు. ఐనా యోసేపు వారిని క్షమించాడు. సోదరుల ప్రాణాలను కాపాడ్డానికి దేవుడే తన్ను ముందుగా ఐగుప్తుకు చేర్చాడని చెప్పాడు. సోదరులు తనకు కీడు తలపెట్టి తన్ను బానిసనుగా అమ్మివేసినా, దేవుడు ఆ కీడును మేలుగా మార్చాడని పలికాడు. భగవంతుని తోడ్పాటు లేందే యోసేపు అంత వృద్ధిలోకి వచ్చేవాడా? అతని సోదరులు ఆ కరువు తప్పించుకొని బ్రతికేవాళ్లా?- ఆది 45,7-8; 50.20.
3. ఏలీయా ప్రవక్తగానున్న కాలంలో ఆహబురాజు పరిపాలిస్తూండేవాడు. అతని భార్య యెసబెలురాణి పరమ దుర్మార్గురాలు. ఆమె యావే ప్రభువును నిరాకరించి దేశమంతటా బాలు దేవత ఆరాధనను ప్రోత్సహించింది. ఏలీయా యావేభక్తుడు కావడంవల్ల ఆ దుష్టరాణికి భయపడి పారిపోయి కేరీతు లోయలో దాగుకొన్నాడు. దేవుని ఆజ్ఞపై కాకులు రేపుమాపు అతనికి ఆహారం కొనివసూండేవి. అతడు ఆ యాహారం భుజించి ఆ లోయలోని నీటిపాయలో నీళ్లుత్రాగి ప్రాణాలు నిలుపుకొన్నాడు - 1 రాజు 17,2-6.
4. ఆకాశంలోని పక్షులు విత్తనాలు చల్లి పంటపండించవు. పైరుకోసి నూర్పుళ్లుచేసి ధాన్యం గిడ్డంగుల్లో నిల్వజేయవు. ఐయినా పరలోకంలోని తండ్రి వాటిని పోషిస్తూంటాడు. మరి అతడు పక్షులకంటె శ్రేషుడైన నరుణ్ణి పోషింపకుండా వుంటాడా? ఇంకా, పొలంలో యెదిగే పూల మొక్కలు కష్టపడవు. నూలు వడికి వస్తాలు నేసికొనవు. అయినా భగవంతుడు వాటిని పూలు అనే వస్తాలతో అలంకరిస్తాడు. వాటి పూబట్టలు సాలోమోను మహారాజు తాల్చిన వస్తాలకంటె యింకా అందంగా వుంటాయి. ఈ పూలమొక్కలకంటె శ్రేషులైన నరులను భగవంతుడు పోషింపడా? తప్పక పోషిసాగు.