పుట:AndhraRachaitaluVol1.djvu/450

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈ ప్రకృతులు గల నవయామినీ-బిల్హణులతో నీ కావ్యము రెడ్డిగారు సంతరించిరి. కథానిర్మాణము ప్రకృతము మనము చూడవలదు. ఆయన కటులు తోచినది. పూర్వపు బిల్హణీయకథ యనౌచితీ దుష్టమని యాయన నమ్మినాడు. కాదుకాదని విమర్శకులు వాదములు చేయుచున్నారు. పోనీ! అందలి కవితావైభవమెట్లున్నది! ఈ ఖండకృతిలో మొత్తము ముప్పది పద్యములకంటె మించిలేవు. కాని, మంచి కండగల రచన.


పరవశుడగాక యిన్నేండ్లు బ్రతికి నేడు

నాకు నీవశంబగుట సంతనమ కాని;

కాఱుతప్పి, కాలము సెడి కర్షకుండు

విత్తు చల్లిన ఫలమున్నె? వెఱ్ఱిగాదె?


                   *

నీవు మనోజ్ఞ మూర్తివి, వినిర్మల కీర్తివి జ్ఞానమందు వి

ద్యా విభవంబునందు బరమాద్భుతశక్తిని ; నాకు జూడగా

దైవము, దండ్రియున్, గురువు,దల్లియు నీవ నఖుండవున్ సదా ;

కావున సాహసించితిని కర్మము ధర్మము పూని తెల్పగన్.

నీప్రతిబింబమగద నే

నో పావనమూర్తి, కినియనోపుదె నాపై

నీషోషించిన లతికను

నీపట్టున నలరనిమ్ము నిర్మల నియితిన్.

                       *


చిఱునవ్వు రేకుల జెన్నారు మొగము దా

మర సౌరభము మది కరగ నాని

కలికి తనము మీఱ దెలివి మెఱుంగుల

జెలగించు కనుల కాంతులకు దలరి