పుట:2015.390519.Shashamka-Vijayamu.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

71


ల్లను బులకింప నీవి వదలం గరకంకణకింకిణీకన
ద్ఘనమణిమేఖలాధ్వనులు గ్రమ్మఁగఁ బైఁ బడి కౌఁగిలించినన్.

89


చ.

పరవశుఁ డయ్యె వాఁడు నలపంకజగంధియుఁ జొక్కి వ్రాలె న
య్యిరువురు నట్ల మోహముల నేమియుఁ దోఁపక యుండి రంత నా
గురుకుచ వానిఱొమ్ముఁ జనుగుబ్బమొన న్నెరుమంగ వాఁడు న
య్యరవిరిబోఁడిమోవిచిగు రానఁగ నెం చిసుమంత కొంకినన్.

90


ఉ.

భావము గాంచి యావికచపంకజలోచన మంచ మెక్కియు
న్వావులు చాలురా హృదయవల్లభ! యం చని వానియందపు
న్మోవి బిఱాన పంటిమొన నొక్కుచు నానుచుఁ జొక్కుచుండఁగా
నావగఁ గాంచి యారసికుఁ డట్లనె దా నొనరింప నెంచినన్.

91


మ.

తరితీపు న్వగలెత్తి మోవి మెలుపుందప్పింపులం జాల య
క్కఱఁ బుట్టింప నతండు తత్తర మొసంగ న్గొమ్మ ధమ్మిల్లమున్
జెరపిన్ గైకొని బాహుమూలయుగళి న్గిల్గింతఁ గావింప న
య్యరవిందానన నవ్వ నాతఁ డధరం బాసక్తిమై నొక్కినన్.

92


చ.

కమలదళాక్షి సంకలితకంకణఝంకృతి సీత్కృతు ల్సవి
భ్రమగతి మీఱ మేను గరుపార మనోజవికారపారవ
శ్యము దయివాఱ నీవి దిగ జాఱ నొకంగము జాళువారఁగా
రమణునిపేరురంబుపయి వ్రాలెను జంత్రపుబొమ్మకైవడిన్.

93


ఉ.

మోమును మో మురంబు నురము న్బుజము ల్భుజము ల్దొడ లొడ
ల్ప్రేమఁ గదించి పాదములు పిక్కలు నొక్కటిగా మలించి పో
రాములనిండుకౌఁగిటఁ దిరంబుగ సౌఖ్యపయోధి నేలి రా
లేమయుఁ బ్రాణనాథుఁడును లీల భుజంగయుగంబుపోలికన్.

94


సీ.

కన్నాత లాఁగించి కాంతుమోము గదించి,
        సారెసారెకు మోవిఁ జప్పరించి
రతిచాతురికి మెచ్చి రమణుఁ గౌఁగిటఁ గ్రుచ్చి,
        మోహాన నూఱాఱుముద్దు లిచ్చి
తనియక యెదురెక్కి దయసేయు మని మ్రొక్కి,
        గుదికాళ్లు వెల్పునఁ గూర్చి నొక్కి
మదనశాస్త్ర మెఱింగి మనసుకొంకుఁ దొఱంగి,
        కాయంబు లొక్కటి గాఁగ మెలఁగి