పుట:2015.373276.Rangaraya-Charitramu.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

94

రంగా రాయచరిత్రము


మి దివాణానకుఁ దప్పుఁ జేసె గతమే మీవారి వేధింప నీ
యుదితక్రోధరసంబు డింపుమని వేయుం జెప్పినా రందఱున్.

228


చ.

పనివడి వారితోడి చలపాదితనంబు వహింప నేల పై
కొని చనెనేని త్రొక్కటము గూడును వైచినయట్లు వై చినన్
మొనకొని వేదురైనను నమోఘముగా జయమందు నండ్రె గా
వున ధరణీశముంటములు వుచ్చిన మేలు సుమీ తలంచినన్.

229


చ.

విను మిసుమంత మామనవి వింత యొనర్పక యొక్కమాస మీ
వనుపమధైర్య మంది చని యంతట నంతట యుండితేని యే
నినుఁ గొనివచ్చి క్రమ్మఱను నిల్పెద నీదగుకోటలోన నీ
మనమున సంశయింపకుము మన్నెకుమారశిరోవతంసమా.

230


ఉ.

వారు దివాణమౌట బలవంతుల రింతటి కెన్నఁగా జమీ
దారులు మీర లట్లగుట దాష్టిక మెల్లను వారిసొ మ్మహం
కారము మీకుఁ జెల్లుబడిగా నొరగొడ్డెము లాడి యోర్వఁగా
లే రెవరేని వారి కదళీదళకంటకసామ్య మౌటచేన్.

231


సీ.

కేకయాత్మజ చేయు కృత్రిమంబునఁ గాన
       బాములఁ బడఁడె శ్రీరామమూర్తి
గడుసుయోధనుచేత నిడుములఁ గుడువఁడే
       ద్వైతవనంబున ధర్మసూతి
కలికృతం బైన దుష్కరబాధ నొందఁడే
       లలనాసమేతుఁడై నలవిభుండు
గాధిసూనుఁ డొనర్చు కస్తికి నోర్వఁడే
       సతియుఁ దానును హరిశ్చంద్రనృపతి