పుట:2015.373276.Rangaraya-Charitramu.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

92

రంగారాయ చరిత్రము


తే.

 ఏడుమూఁడుతరంబుల నిందెయుండి
యాపదలు వాపికొనుచు భాగ్యానుభవము
గొన్న వారముగాని యీకోట వదలి
పోవుట యెఱుంగ మకట యీపూటదనుక.

217


శా.

మా కత్యంతవిరోధిరా జతని సన్మానించి చేపట్టి మా
రాకున్నట్టి దినౌబతు ల్సలుపుట ల్ప్రాధాన్యము ల్గాగ న
స్తోకప్రౌఢిని నీరుకాకినెపము ల్జొడించి పల్మా ఱయో
హాకీము ల్దమ రిట్లు పల్కుటకు నర్హంబే విమర్శింపకన్.

218


శా.

లక్షద్వాదశశుభ్రదానకలితోల్లాసంబున న్మీమనం
బక్షీణప్రభచేఁ జెలంగ భవదీయాంచత్కృపాపాంగస
ద్వీక్షావైభవ మంది మద్విమతపృథ్వీజాని మాకోట నేఁ
డక్షుద్రోద్ధతిఁ గైకొనం దలఁచెఁ గాదా భూరివైరంబునన్.

219


ఆ.

మమ్ము గెలిచి కాని మాకోటఁ జేకొన
నేరఁ డెంతయేని వీరుఁడైన
శూరధర్మమునకుఁ జొప్పడు నగురీతి
బారుదీర్చి నడచి పోరు టెందు.

220


చ.

నలువదివేలకాల్బలమున న్బలవత్తరుఁ డైనవాఁడు రా
ట్కులమణి నాల్గువేలుదళ గొల్వఁగ నుండెడువార మేము వా
రలపస మత్ప్రతాపము దురమ్మున బారునఁ గాని కానరా
దలఘుమనోవినోదగతి నారసి తారసిలించి చూడుఁడీ.

221


క.

 ఆరాచవారి మమ్మున్
బాఱునకుం దీర్చి యొక్కపసిమినిశానీ
వారలచేతికి నిచ్చిన
ఘోరాహవ మోర్చి దానిఁ గొంటిమ యేనిన్.

222