పుట:2015.373276.Rangaraya-Charitramu.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్ర థ మా శ్వా స ము.

39


సీ.

దిగ్గజంబులనైన దివులు కొల్పెడు బృంహీ
       తధ్వనుల్ నెఱపు దంతావళములు
వాసవాశ్వమునైన వడిఁ జూపి లంఘించి
       తోఁకఁ ద్రొక్కఁగ జాలు తురగతతులు
మంథానగిరినైన మాయున్నతముతీరు
       గలదె నీ కను శతాంగములగములు
సేనానినైన నాసీరమ్మున నెదిర్చి
       తప్పులు వెదకు పదాతిచయము


తే.

ఘనతరోల్కానికాయముల్ గ్రక్కఁ దివురుఁ
బారు దీర్పఁగ నగునరాబాతెఱంగు
మందుశకడాలు గుంటిసామానుబండ్లు
చెకుముకితుపాకిసొబగు కౌతుకము నెఱప.

144


సీ.

సాహసోద్ధతమూర్తి జండ్రాల్మహమ్మదు
       హుస్సేన్మయూరనా నొప్పు నతఁడు
మోఖీకృతారిలాడూఖాన్కుమందమన్
       పటుతరాభిఖ్యఁ గన్పట్టు నతఁడు
బహుయుద్ధములఁ బేరు పడ్డ విక్రమశాలి
       సిద్దీబిలాలునాఁ జెలఁగు నతఁడు
శూరాగ్రయాయియౌ జోదుజానూఖాను
       మీర్జా యనెడిపేర మెలఁగు నతఁడు


తే.

మఱియు హసనల్లిఖానుఁ డన్మానధనుఁడు
మొదలుగాఁ గల్గుసరదారు లెదుట నిల్చి
వేలకొలఁదుల జీరాగుఱాలతోడ
నిరుగెలంకులఁ దనుఁ గొల్వ నేపు మిగిలి.

145