పుట:2015.373276.Rangaraya-Charitramu.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

38

రంగా రాయ చరిత్రము


త్యుల్లాసంబున నాధిపత్య మొసఁగన్ యోజించి రావింపుచున్.

138


ఉ.

భాస్కరసన్నిభం బయిన భవ్యతరస్ఫురణాభినంద్యవ
ర్చస్కత గల్గు నీకు నతిసాహసశీలునకుం గళింగస
ర్లస్కరు భార మిచ్చి శుభలక్షణలక్షితుఁ జేసిపుత్తు శ్రే
యస్కర మిట్టికార్య మని యాదరపూర్వముగా వచింపుచున్.

139


వ.

అప్పు డప్ప రాసులఱేనికి నుత్తుంగతురంగమాతంగంబులు
మొదలుగాఁ గొన్నియుపాయనంబులు నుద్ధతులముల్కుగ
జఫరజంగుసిఫహాసరదారుగా రనియెడి దొడ్డకితాబులు నొ
సంగి యతనికిం దగిన సంగడిగా హైదరుజం గనియెడు
యవనపుంగవుం బ్రధానత్వంబునకుం గుదురుకొల్పి మఱి
యును.

14


మ.

తరవుల్ పాలన సేయుచుండునెడలం ధర్మప్రకారంబు సుం
దరమై పర్వఁగ నచ్చటచ్చటిజమీదారుల్ దివాణాన కొ
ప్పరులై గ్రుమ్మర సీమలెల్ల ఖిరదాబాదాను గావింపుచున్
సరకారర్థము దస్తు సేయుఁడు ఖజానా నింపుఁ డింపొందగన్.

141


మ.

అని రాజ్య ప్రతిపాలనానుగుణవాక్యంబుల్ నిజామల్లినాఁ
జను సర్వాధిపుఁ డానతిచ్చుటయు మూసాబూడి వల్లేయటం
చును దా హైదరజంగుతోఁ జనఁ జమూస్తోమంబుతోఁ బైన మ
య్యెను లెక్కింపఁగ రాని రాజసము పెంపెక్కం గళింగానకున్.

142


వ.

తత్కాలంబున.

143