పుట:2015.373276.Rangaraya-Charitramu.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్ర థ మా శ్వా స ము

35


భూపాలననిపుణుఁ డైన పూర్వోక్త శ్రీ
గోపాలకృష్ణరంగ
క్ష్మాపాలకు దత్తపుత్రుఁ గా జేసికొనెన్.

126


తే.

క్షితితలంబున గోపాలకృష్ణరంగ
రా వటంచును మఱి రంగరా వటంచు
నామముల రెంటిచేత నా భూమినాయ
కాగ్రగణ్యుండు మిగులఁ బ్రఖ్యాతిఁ గాంచె.

127


క.

అతఁ డినుఁ డయ్యును గువలయ
హితుఁ డగుచున్ రాజనామ మెసఁగియుఁ బద్మా
దృతి యగుచుఁ దాను ఘనుఁడై
క్షితి మెలఁగుచుఁ జిత్రరీతిఁ జెలఁగుచు మఱియున్.

128


సీ.

తనభుజాదండాసి ధారామహారాహు
       వరిరాజతతుల వెన్నంటి మ్రింగఁ
దనసముద్దీప్తప్రతాపసహస్రాంశుఁ
       డహితాంధతమసమున్ గుహలఁ జొనుపఁ
దనకీర్తి కుముదబాంధవుఁడు శాత్రవలోక
       ముఖపంకజముల సొంపులు హరింపఁ
దనదృఢాజ్ఞావేల మొనసి ప్రత్యర్థిభూ
       పతిసముద్రంబులఁ బట్టువఱప


తే.

నహుష నల రంతి సగర మాంధాతృ పూరు
పృథు భగీరథ శశిబిందు విక్రమార్క
ధర్మతనయుల మఱపించి ధరణి నేలె
రమ్యగుణజాలముల ప్రోవు రంగరావు.

129


తే.

 మన్నెహంవీరపెరమన్నె మద విభాళ