పుట:2015.373276.Rangaraya-Charitramu.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్ర థ మా శ్వా స ము.

31


లావణ్యమూర్తు లగుచు ధ
రావలయం బేలుచుండ్రు రాజన్నీతిన్.

110


శా.

శ్రీనాథాంఘ్రిసరోరుహోదయముచేఁ జెన్నొందుచుం బౌరుషా
ధీనస్వచ్ఛతరస్వజీవనకులై దీపింపుచున్నట్టి య
మ్మానైకాలయపద్మనాయకులకున్ మాన్యాదిపీఠస్థులై
శ్రీనిర్వాహకులైరి వేంకటగిరిశ్రీరావురాజాగ్రణుల్.

111


సీ.

అనపోతవిభుఁడు మహాపరాక్రమశాలి
       గావునఁ దనశౌర్యకలనఁ జేసి
యాజిరంగమునను రాజుల నోడించి
       కృష్ణానదివఱకు గెలిచి దేశ
మును దనకు నధీనముగఁ జేసికొనియె నిం
       కొకపరిఁ బొసఁగిన యుద్ధమునను
దనమీఁద వచ్చిన ఘను లగుదొరలను
       నూటిపై నొక్కని గీటడంచి


తే.

యేకవీరుం డటంచును నెన్నికఁ గనె
వేంకటగిరికుటుంబపుఁ బృథివిపతుల
లోన నారవపురుషుఁ డామానఘనుఁడు
వెలమలకు నెల్లఁ గలిగించె విమలకీర్తి.

112


సీ.

సర్వజ్ఞసింగయ జనపతి యెల్ల వి
       ద్యల నేర్చి తనపేరు సార్థకముగఁ
బండితకోటిచేఁ బలుకవీంద్రులచేతఁ
       బరివేష్టితుండయి ప్రౌఢి మెఱయ
విద్యావినోదియై హృద్య మైనరసార్ణ
       వసుధాకరం బనఁబరగు గ్రంథ