పుట:2015.373276.Rangaraya-Charitramu.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్ర థ మా శ్వా స ము .

19


తే.

ప్రమద మెసగంగ మర్త్యలోకమున నుండి
నిండి రెల్లెడ తండోపతండములుగ
నింద్రపురియందు నిజభుజాహీనచలిత
కలితకరవాలవీరు లాకస్మికముగ.

59


తే.

అట్లు చనుదెంచుచున్న శూరాగ్రయాయి
జననికాయంబుఁ గాంచి యాశ్చర్య మొంది
తత్పురీగూఢచరు లతిత్వరత నేగి
మరుదధీశ్వరుఁ గాంచి నమస్కరించి.

60


శా.

దేవా దేవర వీటి కెవ్వరొ ధరిత్రీభాగమందుండి తే
జోవైశ్వానరులాజిరంగనరులక్షుద్రప్రభాభీక్ష్ణబా
హావిక్షేపితశాతహేతిరుచిధారాకృష్టదుష్టాహిత
క్ష్మావర్యేందిరు లేగుదెంచి కనదాశ్చర్యం బవార్యంబుగన్.

61


సీ.

ఉచ్చైశ్రవంబు చుం చొడసిపట్టి చరాల్న
       నెగిరి యొక్కుమ్మడి నెక్కువారు
నందనోద్యానమన్దారశాఖలు వంచి
       యొఱపుగా నుయ్యెల లూగువారు
కామధేనువ నడ్డఁ గట్టి గుమ్మలు గ్రోలి
       యాబెయ్య యిది మంచి దనెడివారు
సురసరిత్కనకతామరసమ్ము లుడివోక
       తెమలించి బారుగాఁ ద్రెంచువారు


తే.

జలవిహారావసరసాహచర్య మమర
నమరకన్యాకపోలస్తనాతిచిత్ర
మకరికాపత్రములరూపు మాపువారు
నగుచు నెల్లెడఁ దారె యై రగవిరోధి.

62