పుట:2015.373276.Rangaraya-Charitramu.pdf/168

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వా స ము.

167


ననిశ ప్రజానుకాలనమార్గములయందు
            విహితక్రమంబులు వెదకికొనుచు
గురువిప్రబాంధవోత్కరముల పట్టున
            ననువొంద హితవృత్తి నరసికొనుచు
ధర్మార్థసంగ్రహతత్పరజ్ఞానంబు
             తెఱఁగు ప్రాజ్ఞులయందుఁ దెలిసికొనుచుఁ


తే.

 దనయశశ్చంద్రికలు దిగంతమును నిండ
నామృగాంకార్కముగ నతం డాత్మవంశ
ముత్తరోత్తరవృద్ధిఁ బెం పొందుచుండ
సొంపు దీపింప నవని పాలింపుచుండె.

279


క.

 అని బొబ్బిలిరంగారా
యనృపాలచరిత్ర మెల్ల ననిమిషపతికిన్
వినిపించి నారదుండును
ననుమతిఁ గొని చనియె సంత నంతర్హితుఁడై.

280


క.

 ఇది యానుపూర్వితముగాఁ
జదివిన వ్రాసినను వినిన జనులకుఁ గడుస
మ్మద మొదలించును సంప
త్ప్రదమై యభిమానశౌర్యధైర్యాస్పదమై.

281

ఆశ్వాసాంతము

శా.

 సాధుస్తోమనికామరక్షణకళాచంచద్గుణాలంక్రియా
రాధాసూనుసమానదానకలనా రాజన్నిజప్రక్రియా
బోధాగాధరమాధురీణహృదయా పుంభావశుంభద్వయా
మాధుర్యైకనిదానవాక్సముదయా మల్రాజువంశోదయా.

282