పుట:2015.373276.Rangaraya-Charitramu.pdf/167

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

166

రంగారాయ చరిత్రము


క.

 అనుచు పరాసులదొరతన
మనమున నివ్వెరఁగు గాంచి మన్నేహంవీ
రుని రావువంశసంభవు
ననఘమతిం బిలువ బంచి యాదర మొదువన్.

274


ఉ.

 వెంగళరాయభూవిభుని విశుత్రకీర్తిని గారవించి త
త్సంగరపాండితీమహిమ తద్విజయద్రఢిమంబునుం దదీ
యాంగబలప్రభావము ముదావహమై బరగ న్నుతించి యి
చ్చెం గడువేడ్క కొత్తపలిసీమమొద ల్గలకొన్నిరాజ్యముల్.

275


క.

 హయములు మఱియుం గుంజర
చయములు మృదులాంబరములు జాగీరు లుదా
రయశుఁడు మూసాబూసియు
రయమున నిడి యేగె హైదరాబాదునకున్.

276


తే.

 అంత నారావువంశనీహారధరుఁడు
కొత్తపలిరాజ్య మేలుచోఁ గొమరు మిగిలి
కలితకళ్యాణవిభవసంగతి వహించె
భావిసౌభాగ్యసూచకప్రౌఢి మెఱయ.

277


మ.

 కలితప్రాభవధుర్యుఁడై కొనియె వెంగల్రాయ డంతన్ విని
శ్చలశౌర్యోన్నతిచేఁ దలిర్చుచు సమంచల్లీలఁ జెల్వొందు బొ
బ్బిలిరా జాములువాటియందు మును తత్పృథ్వీశ్వరాజప్తి ను
న్న లసత్సైన్యముమీఁదఁ దారసిలుచున్ ఠాణా లుఠాయించుచున్.

278


సీ.

 రాజకీయవిధాన యోజనోద్యోగంబు
         లంచితస్థితి విమర్శించుకొనుచు