పుట:2015.373276.Rangaraya-Charitramu.pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృ తీ యా శ్వా స ము.

163


సీ.

 తనచావు సర్వసిద్ధంబుగా మది గోరి
       సాహసకృతికినై చన్నవానిఁ
దనయేలికవిరోధిదర్పంబు మాపుట
       పరమార్థ మని యేరుపఱచువానిఁ
దమపడినట్టి బన్నముల కిక్కార్యంబు
       ఫలరూప మని యాత్మఁ దలఁచువానిఁ
దనకులస్వాములందఱు మెచ్చుకొన నోర్చి
       పగదీర్చుకొన్న సంభ్రమమువానిఁ


తే.

 దాండ్రకులజునిఁ బొదివిరి దారుణముగ
ఘోరయుద్ధంబు సలిపి యవ్వీరవర్యు
జిదిమి వైచిరి కఠిననిస్త్రింశతతుల
నతని సహచరయుగళసంగతముగాఁగ.

261


సీ.

 లీలమై జాభరల్లీయుబాదుర్లాది
       సర్లస్కరుల గిట్టి జయముఁ గాంచి
యసురు లాఖానుని యంతలేసి సుబాల
       నొగిజిలేబునను గొల్వుంచి మించి
కిమిడిచీఁకటిరాజ్యరమలు చూఱలు గొని
       తద్దుర్గములమీఁద దాడి పెట్టి
యాగౌతమీకటకాంతరాళక్షమా
       తలము నేకాతపత్రముగ నేలి


తే.

 గరిమ జగదేకవీరవిఖ్యాతి నొంది
విక్రమము గన్న రాజన్యచక్రవర్తి
వకట నేఁ డిట్లు తాండ్రపాపయ్య యనెడి
వెలమబెబ్బులిపా లైతివే నరేంద్ర.

262