పుట:2015.373276.Rangaraya-Charitramu.pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృ తీ యా శ్వా స ము.

161


చ.

 తెలతెల వేగు నంతట నతిస్థిరత న్నృపసుప్తమందిర
స్థలనికటస్థజాగ్రుదురుదర్శకయుగ్మము హెచ్చరించుచున్
నలికిడి పుట్టనీక నిశితాసి నగల్చి మృగంబునొంపు బె
బ్బులిగతిఁ బొంచి పొంచి చని భూపతి యున్నతిరంబు డాయుచున్.

253


సీ.

 మణికుండలద్వయీఘృణీమండలంబుల
       దుమికెడు చెక్కుటద్దములవాని
నలవసంతజయంతనలకూబరాదుల
       నట్టిట్టు పఱచు సోయగమువాని
భాగ్యలక్ష్మీసభాభవనాయితము లైన
       తామరసాభనేత్రములవాని
హంససంసత్తూలికాభ్యంచితంబైన
       హొంబట్టుపఱపుపై నొప్పువాని


తే.

 హస్తకములకృతోపబర్హంబువానిఁ
గించిదున్మీలితాక్షుఁడై మించు విజయ
రామరాజవనుంధరారమణుఁ గాంచి
తాండ్రపాపయ్య కోపంబు దీండ్రిలంగ.

254


తే.

 పులిపులి యటంచు మిగులు నార్పులు నిగుడ్చు
నంతలో మేలుకాంచి యయ్యవనిపాలుఁ
డియ్యెలుంగెల్లఁ దాండ్రపాపయ్యపలుకు
తెఱఁగుఁ దెలిపెడు నంచుఁ జింతిలుచు లేచి.

255


క.

 తరవా రరసెడునెడ త
త్తర వాఱక తాండ్రకులసుధాధాముఁ డుదా
త్తరవారభటిన్మదవ
త్తరవారణమునకుఁ దూగు తద్రిపుసరణిన్.

256