పుట:2015.373276.Rangaraya-Charitramu.pdf/161

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

160

రంగారాయ చరిత్రము


సీ.

 రామచంద్రునివంటి రాజత్పరాక్రమ
       శాలి వాలిని ద్రుంచు జాణతనము
పార్థునంతటిజోదు పరఁగ దేవవ్రతు
       మఱుపెట్టి నొంచిన నెఱతనంబు
ధర్మనందనుని యంతటి మేటికుంభజ
       హరణార్థమై బొంకు దొరతనంబు
ననిలజుఁ డట్టివాఁ డతిరహస్యంబుగాఁ
       గీచకుఁ దునిమిన రాచతనము


తే.

 తప్పు గనకుండుటలు ప్రసిద్ధంబుగాదె
జగతి నటుగాన గూఢప్రచారచర్య
నహితు నొంచుట ధర్మువే యని గ్రహించి
పనిచె నొకచారు నతఁ డుండుపట్టుఁ దెలియ.

249


క.

 ఆకంచుకి యల్లనఁ జని
యాకఱకున్ రాచఱేనియావసథసమా
లోకన మొనర్చి క్రమ్మరి
యాకీ లెఱిఁగింప నెఱిఁగి యెఱిఁగి యతండున్.

250


శా.

అంతం దత్సహచారియుగ్మకముగా నారాత్రివేళ న్మహా
ధ్వాంతం బెంతయు నిండికొన్నయెడఁ దద్రాజన్యసేనాని వే
శాంతస్సంచరణంబున స్సమయపర్యంతంబు ప్రొద్దుచ్చి ని
శ్చింతం జేరిరి శత్రురాట్పటగృహశ్రేణీబహిర్ద్వారమున్.

251


తే.

 చేరి యచ్చేరువ నొకింతసేపు దడసి
యాలకించుచుఁ గడునిశ్చలాక మైన
తరిని ఢేరాకనాతుకు ట్టొరసి దానిఁ
దనక రాచూలిచేఁ జించుకొనుచు నేగి.

252