పుట:2015.373276.Rangaraya-Charitramu.pdf/157

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

156

రంగా రాయ చరిత్రము


చలదురుకళేబరముల నావల గమించు
మావటీ ల్కర్ణధారుల ఠీవిఁ దెలుప.

227


తే.

 అట్టిజగడంబుఁబటిమ భయంబు గొలుపు
టంతయు నెఱింగి బాసట యనిచెఁ దనదు
మూలబలముల నారాజముఖ్యుఁ గవియ
నపుడు హైదరుజంగు రయంబు మెఱయ.

228


ఉ.

 ఆదళమీద మార్కొని యహంకృతి మత్పరవాహినీసము
త్పాదితఘోరవీరరణపాండితి యోర్చుచుఁ జెండుబెండుగా
మొదిరి వెల్మవార లసి ముద్గర పట్టెస భిండివాల శూ
లాదుల సాదులం ద్రిజగదద్భుతశౌర్యరసంబుపెంపునన్.

229


శా.

ఆదుస్సాధులు సాదు లప్పుడ యుతాశ్వాసాదితస్తోములై
మీఁదం జెందెడు బాణవర్షములచే మేను ల్సరంధ్రంబులై
ఛేదచ్ఛేదములై పడ న్నడఁచి కాశీసేతుపర్యంతభూ
ప్రాదుర్భూతయశోభిరాము లగుచున్ భాసిల్లి రాభూపతుల్.

230


క.

 శంకాతంకములేక ని
రంకుశగతి నడచి బలచయంబులతోడన్
వెంకయ్య మొదలు గలవీ
రాంకుల మైదొరగి చేరి రమరావతికిన్.

231


తే.

 వెంగళనృపాలమణియు నిజాంగలతిక
గాయములవఱ్ఱుగా మహోగ్రాజియందు
ఖానుసాహెబు ఢేరాకు గదియ నడచి
చేర్చె నిల మేను ప్రాణావశిష్టుఁ డగుచు.

232


తే.

 లక్షదళమీద నాలువేల్దళముతోడ
కయ్యమున కెక్కుట సమానకక్ష యనుచు