పుట:2015.373276.Rangaraya-Charitramu.pdf/156

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృ తీ యా శ్వా స ము.

155


పందీటె లలుగంటిపార నుక్కున శిలే
       బక్తరుగుఱ్ఱాల బసికి బసికి
వెన్నులు సరికట్టి విసిరి సిఫాయీల
       చిప్పయీటెలఁ గ్రుచ్చి చిమ్మి చిమ్మి
కడిఖండములు గాఁగఁ గాల్వుర పేరెద
       ల్చికిలీకఠారులఁ జించి చించి


తే.

 యలుకమై సూర్యసోమవీథులు పడఁగఁ
గొట్టి గోరించి లష్క రిట్టట్టుపఱచి
తూలితుండెంబు వాడుచు దురమునందు
విక్రమప్రౌఢి నెఱపిరి వెలమదొరలు.

223


మ.

 అరిరాజన్యపయోధి నిర్మథనదీక్షారంభసంరంభమం
దరు లౌ వారలఁ గిట్టి నెత్తురు వసంతంపుం జడిం దోఁగఁగా
శరవర్షంబులు గప్పి రప్పు డలుకన్ క్షత్రాగ్రణు ల్కార్ముకో
త్కరమౌర్వీనినదంబు లంబునిధినాదంబు న్విడంబింపఁగన్.

224


మ.

 కరవాలము లొఱ ల్వెడల్చుకొని ఖడ్గాఖడ్గిగా నంత దా
మరదమ్మప్రభుఁ డాదియైన వెలమ ల్మత్తద్విపశ్రేణి తా
మరపువ్వు న్గొలనుంబలెన్ గలనభీష్మప్రౌఢదోఃక్రీడ చూ
పి రొగిన్ నెత్తురుటేటివెల్లివరద ల్పెల్లీఁతలై పాఱఁగన్.

225


మ.

 అపు డన్యోన్యశరాసిభీషణరణవ్యాపారపారీణతన్
రిపులాటోపము లొప్పు రాచకొమరు ల్వెల్మ ల్బహుక్రోధవై
రపరీతాత్ములునై పరస్పరహతిం బ్రాణాంతపర్యంతముం
జపలత్వంబు వహింప కిట్లు పెనఁగెన్ సంగ్రామరంగంబునన్.

226


తే.

 శోణిత నదీ పరంపర ల్సూడనయ్యెఁ
దేలియాడెడు మత్తశుండాలజాల