పుట:2015.373276.Rangaraya-Charitramu.pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృ తీ యా శ్వా స ము

153


శా.

 ఆరాజన్యునిపౌఁజుపైఁ బ్రళయరౌద్రాకారుఁడై చేర్చుచున్
వీరగ్రామణి రావువంశమణి దోర్వీర్యాధరీభూతనా
నారాతిం జెలికానివంశజుని నన్యాసాధ్యు దమ్మన్ననున్
ధీరస్వాంతుల కందిబండకులులం దీకొల్పె నుద్వేగుఁడై.

216


శా.

 వారు న్ఘోరశరాసవల్లరుల నిస్వానంబు లభ్రాపగా
నీరేజాంతరధార్తరాష్ట్రభయకృన్నీరంధ్రమంద్రధ్వనిన్
మీర న్రాజవతంసుసైనికులపై మేకొంటయుం దచ్ఛమూ
వారంబు ల్పురికొల్పి డాసి రతిదుర్వారాసిధారారుచిన్.

217


మ.

 పులులుం గోల్పులులుం గరు ల్కరులునున్ భూమీధ్రము ల్భూధరం
బులు నంభోనిధులం బుధు ల్గదియు చొప్పు లెల్పుచు రాచబి
డ్డలునుం వెల్మదొర ల్దురమ్మునకు నొడ్డారించి క్రొవ్వాడి బా
కులతో గ్రుమ్మైసలాడ సాగి రలుకన్ గోవిందశబ్దార్భటిన్.

218


సీ.

 కరికాండతుండద్రుఘనతాడనంబుల
       వకవకలై కృకాటికలు పగుల
భీకరకరవాలభిండివాలాదుల
       దాకుల నొగిలి కంధరము లగలఁ
బరిఘనిష్ఠురభూరిపరిఘాతనమ్ములఁ
       దుండమ్ము లగుచుఁ బెందొడలు విఱుగఁ
బుంఖానుపుంఖప్రపూరితశరవృష్టి
       నెమ్మోముఁ దమ్ములయెమ్మె చెఱుప


తే.

 నిరుపమానాహవోద్వేగనిర్ణిరోధ
విక్రమక్రమనైపుణివినిహతాత్మ