పుట:2015.373276.Rangaraya-Charitramu.pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము.

151


ఉ.

 వెంగళరాయఁ డెంత రణవీరుఁడొ కాని నితాంతవిక్రమా
భంగురశక్రసూతియయి భాసిలుచు న్మదుదగ్రసర్వసే
నాంగములెల్ల త్రుళ్లడచె నాతని యాహవకేళి కిప్పు డె
న్నంగఁ ద్రిగర్తసైన్యము లనం గనుపట్టెడు నిబ్బలావళుల్.

206


క.

 రేచెర్లగోత్రసంభవు
లై చెన్నగు వెలమవారి యభినవశౌర్య
ప్రాచుర్యబలముఁ బోలిన
దేచాయం జూడ మవని హిందువులందున్.

207


సీ.

 మెకములనడుము చించుకవచ్చు బెబ్బులి
           పోలికె బొబ్బిలిపురినృపాలుఁ
డుడివోని కినుకచేఁ దొడరి యీశిబిరంబు
           నడిబారు చొచ్చి వెన్నడినవారు
ఘోరదావాగ్నిచే నీరసారణ్యంబు
           బోడ వడంగుడునట్లు కడిమి దొరఁగి
చనియె నస్మత్సేన సంగ్రామరంగంబు
           పీనుంగుపెంటయై పేర్చె నింక


తే.

 నేమి సేయంగ నోపుదు నేర్పరించి
వీరు నెవ్వాని నొడఁగూర్తు వీరి నోర్వ
మున్నె సేనాధిపతులెల్లఁ జన్నవార
లంతకునియింటి కంతంత నతిథు లగుచు.

208


తే.

 వారు స్త్రీబాలవృద్ధసంహారఘోర
దారుణవిపత్తి కొడఁబడి బారుకట్టి
మరణమున కెత్తి వచ్చు నమ్మానధనులు
బహుజనహతంబు సేయరే భండనమున.

209