పుట:2015.373276.Rangaraya-Charitramu.pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

150

రంగా రాయచరిత్రము


మిధఃకర్కశగదావిదారితశారీరావయవంబునుం గావించు
చుం బిరుతివియక ఖడ్గాఖడ్గియుం గుంతాకుంతియుం గచాక
చియును బాహాబాహియునుంగా సంకులాహవం బతి
భయావహం బయి పరఁగం బ్రవర్తిల్లు నప్పుడు.

202


క.

ఒకధూము రేఁగి లస్కరు
పికపికలై తుములరణము పెంపున నన్యో
న్యకరాసిసంహతులచే
వికలతఁ గని రొరులు తమరు వీ రనుకొనకన్.

203


సీ.

 సంకెల ల్దెగ నూడ్చి సాధ్వసావిలములై
       బెగడొంది పఱచు స్తంబేరములును
గట్టుత్రా ళ్లగలించి కళ్లేల కాఁగక
       భీతిల్లి పరువెత్తు వీతితతులు
తరవార్లు మఱచి కత్తళములు జీరాడ
       నూడనిఁబాడు రాహుత్తవరులు
దండుకల్లిల్లిచే నొండొండుగానక
       కానకై జరగెడు కాల్బలంబు


తే.

 లాయురవశిష్టులై తారుగాయగాండ్రు
జీవితాశలు వదలి భుజించుకొనుచు
నోరలు బిబ్బీలు నగుచు లష్కరు చలించె
మందరోన్మథితాంభోధిచంద మొంది.

204


చ.

 అపుడు నబాబు దుర్గమతమాద్భుతశౌర్యపరాంగ వేంగళా
ధిపభటనిర్ణిరోధసముదీర్ణపరాక్రమదీర్ఘనైజయూ
ధపగత దైన్య మారసి నితాంతసమాకులచిత్తవృత్తియై
నృపవరుఁ బూసపాటికులునిం గని యిట్లనియె న్రయమ్మునన్.

205