పుట:2015.373276.Rangaraya-Charitramu.pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీ యా శ్వా సము.

148


డయి నిలిచి హుంకరించుచుం దఱముచుఁ గదిరివయిచు
చుం గొంతదడపు పోరి యనంతరంబ బలిమి దఱగి మైసోలి
తొరఁగి మింటి కెగయు తగరుజక్కేలికపోలికం బ్రద్యోత
మానజ్యోతిర్మయస్వరూపమ్మున నమ్మహావీరపురుషమూర్తి
మూర్తిత్రయీమండలుఁ డగు మార్తాండునిమండలంబుఁ
జించుకొని యభ్యంచితప్రకారంబున నిద్దివిజపురి కరుగు
దెంచె నప్పుడు.

177


ఉ.

 అవ్వల నెట్టులుండెను దదాత్మజుఁ డాధరణీశుసోదరుం
డెవ్విధిఁ గాన రైరి దుర మిట్టి విదారుణవృత్తిఁ బర్వుచో
నెవ్వగ మానె నిట్టికరణిం ధరణీజనకోటి కాత్మనం
చవ్వెయిగండ్లవేల్పడుగ నాలపుదిండ్ల యగారు లిట్లనున్.

178


వ.

 అంత నగ్గడీదుర్గంబునందుఁ గ్రందుకొని యమందమంద
రాచలవిఘూర్ణమానార్ణవమధ్యప్రభూతభీతికరకాలకూ
టానలజ్వాలాభీలంబై దవానలావేశితకుత్కీలంబుచందఁబు
నం గీలిలీలాకలాపం బపారంబై ప్రళయకాలానలంబై ప్రవ
ర్తితవైశ్వానరప్రతాపంబులం దిరస్కరించుచుఁ జటచ్ఛిట
చటచ్ఛటార్భటీనిర్దళితదిక్కోటరం బగుచు నుద్దండదండ
ధరమండలాగ్రంబులం బోని చండజిహ్వామండలంబులు
పుండరీకప్రభవాఁడభాండంబు మండిపడంజేయ భూయః
ప్రకారంబున నిండికొనుచుం గండు మిగిలి యనేకప్రకార
విధ్వస్తస్త్రీబాలవృద్ధాదిబహుప్రాణి లోకభీకరంబై తొంటి
కాలంబునాఁటి ఖాండవదహనంబుచందంబున నిర్ధూమ
ధామంబుగా మండం జొచ్చె నప్పు డుప్పరం బెగసి బురుంజు
లెక్కిన ఫరాసుమండలంబు లుద్దండవేణుదండమండలా