పుట:2015.373276.Rangaraya-Charitramu.pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృ తీ యా శ్వా స ము

139


దారుణాకారసాహసౌద్ధత్య మమర
నంతిపురి కేగ మొఱసె దిగంతరములు
ధరణి వడవడ వడఁకె భూతలము బెగడె.

157


తే.

 రాయమణి రాణి తనకుమారాగ్రయాయి
నపుడు కొండొకదాదికి నప్పగించెఁ
గోట వెడలించి బ్రతికించుకొ మ్మటంచు
నట్లు గావించె నద్దాయి యడలువొడమి.

158


తే.

 మఱియు నారాయమన్నీనిమానవతియుఁ
బాణితలమున శాతకృపాణిఁ బూని
దానిచే మేను దొరఁగె మద్వైరివంశ
మకట నిర్వంశ మగుఁగాక యని శపించి.

159


తే.

 అపుడు పశుపక్షిమృగములు నవనిజనము
లభ్రవాణియు విస్మయం బందికొనుచు
నమ్మహావీరపత్ని శాపమ్మువలన
నట్ల కాఁగల దని కొనియాడి రంత.

160


క.

 ఘననిశితఖడ్గధారన్
మొనకొని చెలికానివంశమూర్ధన్యుఁడు పెం
పున వడిపడి నంతఃపుర
వనితాజనతాతిచిత్రవధ విధి నడపెన్.

161


తే.

తక్కుగల యట్టి యభిమానధనులు వెలమ
లొక్కనూరిండ్లవా రనలోగ్రశస్త్ర
నిహతులై రంగనాశిశుసహితు లగుచుఁ
దద్విచారణ మెంతని తలఁపవచ్చు.

162


తే.

 దేవతిర్యఙ్మనుష్యులం దీవిధంబు