పుట:2015.373276.Rangaraya-Charitramu.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక

13


సీ.

అం దగ్రమహిషియం దలఘుప్రతాపుని
       వేంకటరామపృథ్వీపతిలకు
సన్నుతౌదార్యు సూరన్నప్రభూత్తంసు
       రామభూమీమండలామరేంద్రుఁ
గొండొకసతియందు గురుశౌర్యు వేంకట
       నరసింహరాయభూవరవతంసు
ఘనునివల్లారాయ జననాయకవరేణ్యు
       రామచంద్రక్షమారమణచంద్రుఁ


తే.

గ్రమము దీపింపఁ బుత్రషట్కంబు గాంచె
మువుర మువ్వుర సమతానుమోదలీల
నమ్మహాసాధుసాధ్వీయుగ మ్మెలర్పఁ
బ్రబలరుచిహేళి కొండలరాయమౌళి.

38


తే.

 తత్తనూభవషట్కసౌందర్యధైర్య
శౌర్యచాతుర్యధుర్యతాసరణిఁ దెలియ
విన్నవించెద మిగుల వేర్వేర నెన్ని
సకలజనమానసానురంజకము గాఁగ.

39


సీ.

 ఏధన్యుసత్కీర్తి యిందుకుందమరాళ
       ధారాళరుచులతోఁ దారసించు
నేధీరువితరణం బినతనూసంభవు
       విశ్రాణనప్రౌఢి వీటబుచ్చు
నేవీరుదోశ్శౌర్య మింద్రనందనుభుజా
       పాండిత్యమునకు విశ్రాంతి యొసఁగు
నేభవ్యుసౌందర్య మిక్షుచాపసురూప
       నైపుణ్యగుణముల నేఁపు గాంచు