పుట:2015.373276.Rangaraya-Charitramu.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృ తీ యా శ్వా స ము.

115


యిచ్చకు వచ్చినట్టు లిఁక నేయుఁ డనె న్జనపాలమౌళియున్.

62


తే.

 సంధి పొసఁగమి నిట్టి దుస్సంధి గూడె
నింకఁ బోదని యొండొరు లెచ్చరింపు
కొనుచు బురుజులఁ దగు ఫిరంగులన గాదు
కొలుప సాగిరి వేనవే ల్గుములు గూడి.

63


చ.

 చొరఁబడి వచ్చువారి గుఱిఁ జూచుచుఁ గొంకక జేరుగళ్లలో
నురువడి వంచిపట్టి యెడ యూదక పై నెలగోలురగ్గడీ
యురువడి వెంబడి న్నిలిచి యోర్చుచు నేయఁగ మూఁగి పెల్లుగాఁ
బరువడి నొక్కపెట్టునఁ దుపాకులు ఢామ్ముఢమీఢమీలునన్.

64


శా.

వాసిం బేర్కొను రంగరాడ్గజనుదవ్యాసంగము ల్మాని యా
మూసాబూసి ముఖాహితానననవాంభోజాతగంధగ్రహే
చ్ఛాసంరంభనిగుంభితారవములై చంచద్గతి న్వచ్చు భృం
గీసంఘంబు లనంగ వ్రాలెను దుపాకీగుండ్లు రివ్రివ్వునన్.

65


సీ.

 కోటపేరిటిశక్తి గ్రుడ్లెఱ్ఱ గావింపఁ
       బొరిఁబొరి రాలునిప్పులొ యనంగ
రణదుర్గమీద నీరంధ్రంబుగాఁ జల్ల
      రాజిల్లు నాచార లాజ లనఁగ
గడిదుర్గ మనియెడి కాలాహి గ్రక్కిన
      క్రొవ్వేడిమివిసంపుగుళిక లనఁగ
రంగరాయక్షమారమణాభ్రమునఁ బుట్టి
      దొరఁగెడు పిడుగుక్కుతునక లనఁగ