పుట:2015.373276.Rangaraya-Charitramu.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృ తీ యా శ్వా స ము.

111


చ.

 అతఁడును నట్ల యేగి యనయ మ్మిది వారలు పిన్నవారితో
హత మగువారు మీరు తెలియ న్బలుక న్వివరించు కేని యు
ద్ధతమతులై దురం బగు విదారణపుం బని పూని యిట్టిదు
ర్మతి విడ వేని పై నుసురుమానదు నీకు నిజంబు ఖానుఁడా.

44


తే.

 కోట విడిచి పోవ రాటోపములు జూపి
తిరుగబడి దురంబు నెరవనోప
రాత్మఘాతవలన నభిమానరక్షణం
బనుమతించువార లకట వారు.

45


మ.

 నయ మిం తేనియు లేక మీర లటు లన్యాయంబుచే రాగని
ర్భయతం దాల్చుచు మేము మానుషపువర్ణం బౌట మీ కిట్లు ని
ర్దయ యొప్పన్ విధి లేదు చావక యధర్మవ్యాప్తి చేకూరు మీ
పయి చైఁ జేసెడు బుద్ధి లే దిది మనోవాక్కాయకర్మంబులన్.

46


చ.

 మరణము డాసినప్పు డసమానపరాక్రమశక్రసూతిభూ
వరతిలకంబు రంగనృపవర్యుఁడు పోరున నోల మాస చే
కురఁ డటమీఁద నెందఱనుఁ గూల్చునొ చచ్చెడు వాని కుర్వి సా
గర మది జానుదఘ్న మగు గా యని యాయన యేగె క్రమ్మరన్.

47


తే.

 అంత నచ్ఛిద్రకర్ణుఁ డుద్యద్దవాగ్ని
పగిది మండుచు నిప్పుడ బవరమునకు
నూలుకొల్పెద నని లేచి మ్రోలనుండు
పసిడిజలపోతఖాతి నీపైవి దొడిగి.

48