పుట:2015.373276.Rangaraya-Charitramu.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

110

రంగారాయ చరిత్రము


ద్దతుగారై ప్రకటించుచు న్నిలిచెఁ జెంత న్పాండవశ్రేణి కి
ష్టతము న్నాజికి సైన్యనాథుఁ డగు ధృష్టద్యుమ్నుచందంబునన్

38


చ.

కరులు రథంబు లశ్వములు కాల్బలముల్ సమరోచితక్రియా
సరణి నలంకృతంబు లయి సత్వరగా నరుదెంచి నంత ని
ష్టురభుజసాహసద్రఢిమ జొప్పడ జాగ్రతతోడ దానునుం
గురుతరలీలమై పసపుకోకలు దాలిచి నిల్చె నాజికిన్.

39


శా.

రంగారాయనృపాలుఁ డిప్పగిది వీరగ్రామణుల్ మెచ్చ స
ర్వాంగాలింగితశాలి బాసి చయహృద్యత్కంచుకభ్రాజియై
వెంగళ్రాయుని కాత్మసోదరున కుర్వీభార మర్పించి సూ
నుం గౌతూహల ముప్పతిల్లఁ దదధీనుం జేసి యాపిమ్మటన్.

40


క.

చెలికాని వెంకభూవరు
నలఘుస్థైర్యంబు మెరయ నవరోధజనం
బుల నాలోకనయాత్రకు
నలువొందఁగ నీయ కొల్పు మని దృఢమతియై.

41


చ.

అపుడు ధరామరాగ్రణుల కానతుఁడై తిలభూహిరణ్యగో
కపిశపిశంగవస్త్రతురగప్రకరాదులు చాల నిచ్చి ని
శ్చపలమనస్కతన్ వివిధసౌరతతిన్ భజియింపుచున్ త్రివి
ష్టపపదవీసమాక్రమణసంభవలగ్నవిచారమగ్నుఁడై .

42


శ.

ఖానునియడకు జిరాయ
త్ఖానాబాయన్న ననిచె కడువడి రంగ
క్ష్మానేత యమరలోక
ధ్యానారూఢాత్ముఁ డిట్లు తగదని తెలుపన్.

43