పుట:2015.373276.Rangaraya-Charitramu.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృ తీ యా శ్వా స ము.

107


మ్మీదివిచార మెట్లని యమేయపరాక్రము రంగరాయధా
త్రీదయితుం గుఱించి విచరించిరి యచ్చటి పెద్దమానసుల్.

27


క.

 అంతట రంగారాయఁడు
చింత యొకింతయును లేక చెన్నగు ధృతి మ
త్స్వాంతమ్మున బురు జెక్కి త
దంతికగతఖానుసేన నంతయుఁ గాంచెన్.

28


తే.

చూచి తలయూఁచి తద్బలస్తోమభీమ
సమరసన్నాహసాహసోత్సాహములకు
నబ్బురం బంది వీరంద ఱస్మదీయ
లోహనాళంపుగుళ్ల వ్రేలుదురుగాక.

29


చ.

 అని కృతనిశ్చయుం డయి నిజాశ్రితవీరభటప్రతానముం
గని కనుసన్నలో మెలఁగఁగాఁ దగురీతిని నియ్యకొల్పి మీ
రును జతనంబుగాఁ గరసరోరుహకీలితలోహనాళులై
సునిశితకుంతసంతతులు శోభిల నుండుఁ డటంచుఁ బల్కుచున్.

30


తే.

 మనయరాబాసమిష్టి భీమంబు గాఁగ
మందుగుండును గట్టించి పొందుపఱచుఁ
డెందు నెందుల ననవుఁడు గ్రందుకొనుచుఁ
దత్తదధికృతపురుషు లందఱును జెలఁగి.

31


సీ.

నక్రప్రదీపనిర్వక్రశుక్రాభీల
       కీల లొల్కెడు ఫిరంగీలవారు
కాలకూటంబులు జ్వాలాముఖంబులై
       క్రాలెడు జభరుజంగీలగుంపు
కాలకాలాయసాకారఘోరమ్ములై
       పొలుపొందు గుంటికోపులబిడారు