పుట:2015.373276.Rangaraya-Charitramu.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్వి తీ యా శ్వా స ము.

99


మ.

గడిదుర్గం బది వానిపై నడరు రంగల్లోహనాళావళుల్
పిడుగు ల్గ్రాసినయట్టిపిట్టలముగా భీమోద్ధతి న్వేఁడి గు
ళ్లడలింపంబడిపోవవే పిడుక వేట్లాటా సుబావన్న నీ
చెడుగు ల్బేరికి నోడునే యరుగునే చిచ్చమ్ము దా కిమ్మహిన్.

253


తే.

ఎదిరిచావును దనచావు నెఱుఁగకుండ
వెలమవర్ణంబుతేఱఁ గేగు వెఱ్ఱి గలఁడె
భీతిలఁగఁ బైకి వా రిట్టి బెడద డాసి
వచ్చుచో నిల్తురే పిన్నవారితోడ.

254


ఉ.

వారలు ధర్మమార్గ మెడఁబాయక పైక మనేక మిచ్చుచు
న్నారమ నాయనాదరమున న్గ్రహియింపక పండువంటిసం
సారులయింటిమీఁది కతిసాహసవృత్తిని జంప నేగు దు
ర్వారతరాఘ మిప్పుడ యవారితమై నినుఁ జుట్టుముట్టదే.

255


క.

కులహాని పాపహేతువు
కలహం బరయంగ యశము గలుగదు దీనిన్
వల దుడుగు మంచు నెంతయు
నలుక న్హసనల్లిఖానుఁ డాడిన పిదపన్.

256


తే.

కొలువునం గలవారు నాగోజిరాయఁ
డాదిగాఁ గల్గువారు న్యాయంబు దొరల
నట్ల పల్కిరి యుదుటురా జంతలోన
చిరివిసపుమాట ఖానునిచెవిని సోఁక.

257


తే.

వీరు సరకారు తా జమీదారుఁ డరయ
నెదిరిసత్వంబు తనసత్వ మెఱిఁగికొనక
హుకుముచొప్పున నడవక వికటమతిని
దిరుగఁబడి యుంట సరసంపుఁ దెఱఁగె యనియె.

258