పుట:2015.370800.Shatakasanputamu.pdf/406

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పీఠిక

ఈచిత్తబోధశతకము, మాససబోధశతకము నొక్కడే రచించినటులఁ దోచుచున్నది. విషయమునందు రచనమునందుఁ బదముల గూరుపునం దీరెండుశతకములందు సామ్యముంటయేగాక వంశవృత్తము దెలుపుపద్యము మంగళపద్యము ఇంచు కూర్పులతో సమముగా నున్నవి. కాని చిత్తబోధశతకము మానసబోధశతక మంత ప్రౌఢముగా నుండకపోవుటచే చిత్తబోధశతకము ప్రథమప్రయత్న మని యూహింప నవకాశము కలుగుచున్నది.

శతకము రచించినకవి తాడేపల్లి పానకాలురాయఁడు. ఇతఁడు నియోగి బ్రాహ్మణుడు. మంగళగిరిపొన్నూరుక్షేత్రములను పలుమాఱు వర్ణించుట బట్టియు శ్రీకాకుళక్షేత్రమాహాత్మ్యము వాకొనుట బట్టియు నితరాధారముల బట్టియుఁ గృష్ణాతీరమునందలి తాడేపల్లి నివాసియేమొ యని నిర్ణయింపవచ్చును.