పుట:Bilva Mangala, Sri Pada Kameswara Rao.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

100 బిల్వమంగళ [అం 4

వర్త - ఆ సంగతి నీ కేలాగు తెలుసును?

గోపా - కృష్ణనామస్మరణతప్ప అతని కింకో పనిలేదు, ఆలాటివాడు బృందావనము పోతే కృష్ణుడు డగపడడూ?

వర్త - బృందావనము పోతే కృష్ణుడు లభించునా?

గోపా - దొరకడేమి ? నీవు గొప్ప జ్ఞానివే!

అహ - నీకు కృష్ణు డగుపడ్డాడా?

గోపా - నేను కృష్ణా కృష్ణా అని తదేక ధ్యానముగా భజన చేస్తున్నానా ? నామనస్సంతా గుడ్డివానిమీదే ఉంది, అతని నామమే నేను స్మరిస్తూంటాను. నా కతడే కనిపిస్తూన్నాడు. దేనిమీద గురి ఉంటే అది లభించును.

వర్త - నీమాటలు వింటే నాచిత్త క్షేత్రమందు కొత్తగా ఆశాంకూరము మొలుస్తూంది...బృందావనము వెళ్లితే ఎవరికి దేనియందు గురిఉంటే వారికది లభిస్తుందా?

గోపా - పోయి చూడరాదా?...నేనాతనితో చెప్పనా?..మీరు రేపుచేరి నావపై పోతారు కదా? నే నతని నక్కడికి తీసుకొని వస్తాను. నదియొడ్డున మర్రిచెట్టుక్రింద అతడున్నాడు, అక్కడ బ్రహ్మరాక్షసి నున్నాదని వదంతి-ఆ చెట్టు క్రిందే అత డున్నాడు! నాకు వేళ మీరుతూన్నది, నేను పోతాను, మీరు రండి..(పోవును)

అహ - ఈబాలుడు గోపాలునిలా గున్నాడు. అమ్మా అని పిలిచినతోడనే నాకు ఒళ్ళు పరవశ మయింది.

వర్త - ఇతడు రావడము చేతనే మన కాశ కల్గింది.