పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


ఆంబకుజోడు పంచవిశిఖాంబకుజోడు విదేహరాజ జా
తాంబకుజోడు సాయక శయాంబకుజోడు పతంగలోక రా
జాంబకుజోడు మజ్జననియై భువనంబుల మించినట్టి కృ
ష్ణాంబ గుణావలంబ విబుధావళినేలు భళీభళీయనన్.

లక్ష్మీసమాఖ్యయౌ లలనతో గృహమేధి
       భావంబుచేఁ జాలఁ బ్రబలినాఁడఁ
గవిత వైభవులు సింగన్న యనంతుండు
      నాదిగా పుత్రుల నందినాఁడ
శోభితాప స్తంభ సూత్ర పవిత్ర కీ
      ర్తిస్ఫూర్తిచే వర్తిల్లినాఁడ
నఖిలవైష్ణవరహస్యార్ధోపదేశంబు
      లనుపమభక్తిమై నందినాఁడ
నందనందన పూజనందవార్ధి
నోలలాడుచు సద్గోష్ఠినున్నవాఁడ
సూరిమాన్యుండ నల్లాడు నరసింహ
నామకుఁడ సంతతగురు ప్రణామకుండ.

ఈ పై పద్యాల ననుసరించి నారదీయపురాణ కృతికర్తయైన అల్లాడు నరసింహకవి వంశం ఈక్రిందివిధంగా అవతరించినట్లు అవగతమవుతున్నద

కశ్యపుడు

కాశ్యప వంశం

ఆ వంశంలో

అల్లాడుమంత్రి - నాంచారు (భార్య)

చెన్నప్ప - కృష్ణాంబ (భార్య)

నరసింహకవి - లక్ష్మి (భార్య)

సింగన్న - అనంతుడు - ఇంకా మరికొందరు పుత్రులు.