పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/674

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


గోరునట్లు మాతృగర్భనిర్గమంబుఁ గాంక్షింపుచు, తృషితుండు
తటాకంబు నపేక్షించినట్లు పరిభ్రమించుం గాన, గర్భంబులో
నున్నతఱి సౌఖ్యంబు లభింపదు; గర్భంబు వెడలినయప్పుడు బాహ్యా
నిలస్పర్శ నొంది, తల్లియుం దాను మూర్ఛనొంది, బహుదుఃఖంబు
లనుభవించి, సేద దేరి, గర్భంబులోఁ గల జ్ఞానంబు మఱచి, మున్ను
గోరిన యాశలు విఫలంబులై, యురస్థమృత్యుని భోగవాంఛలుంబలె,
లభింపవు; యోగియైన మునియుంబోలె గర్భంబున నన్నియు
నెఱింగి బాహ్యంబున విస్మృతి నొందు; జాగరసుషుప్త్యవస్థల యట్ల
గర్భబాహ్యప్రదేశంబుల వర్తించు మఱియు.

164


తే. గీ.

పృథులబాహ్యానిలాసినిర్భిన్నబోధ
వృక్షనవ్యాంకురములోలి వెడలి వచ్చు
నల్పమున కల్పమును నైన యట్టి జ్ఞాన
మదిని వృద్ధి వహించు దేహంబుతోడ.

165


తే. గీ.

శాస్త్రసత్సంగతోయసేచనసమృద్ధిఁ
జెలఁగు జ్ఞానాంకురముఁ బ్రోది చేసి, చెట్టుఁ
గట్టి, పొదలిన యట్టి వృక్షంబువలన
మోక్షఫల మందుదురు మౌనిముఖ్యవరులు.

166


తే. గీ.

అర్థకామానుగతులైన యట్టివారి
యాత్మలోఁ గల్గునట్టి జ్ఞానాంకురంబు
ప్రబలవర్షానలప్రతప్తమయి విఫల
మై మరణఖడ్గవిచ్ఛిన్నమై చలించు.

167


క.

జననంబును మృతియుఁ బున
ర్జననంబుఁ బునర్మృతియును సాంద్రముగాఁ గూ
ర్చిన మౌలిక కడతేరదు
ఘనవిజ్ఞానాసిచేత ఖండించఁదగున్.

168


వ.

ప్రసంగంబున బాల్యదుఃఖం బెఱింగించితి; నాదివ్యాధులచేఁ బీడింపం
బడి పల్క సమర్థుండుగాఁ డంతఁ క్రీడాసక్తుండై మజ్జనభోజనాది
పరేచ్ఛచేఁ గ్లేశంబు నొందియుండు; పురుషార్థబుద్ధిచే నెద్దియేనియు
నన్యులతో హాస్యంబు గావించు; వృథాశ్రమార్తుం డగు; నిది బాల్యంబు