పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/672

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


క.

శూరుండవు నీ వసిఁ గొని
దారుణగతి వచ్చునపుడు ధరణి వణంకున్
సార మెఱుఁగండు నీదు కు
మారుఁడు సుకుమారుఁ డితని మన్నించు నృపా!

156


తే. గీ.

చాలు రోషంబు [1]వీనిపై శశముమీఁద
సింహపోతంబుఁ దాఁ దాఁకఁ జేసినట్లు;
తాళు మిందున కొక్కయత్నం బొనర్చి
యతని రక్షించు మింక దైత్యాధినాథ!

157


సీ.

అర్భకుం డతఁడు దండార్హుండు గాఁ డతి
                       జడుఁడు నీసుతుఁ డయ్యుఁ జాల నసుఖ
మందుచున్నవాఁ; డత్యంతకారుణ్య
                       పాత్రుఁ డింతటనైన బహువిధముల
బుద్ధిగాఁ జెప్పి, యుద్భుద్ధంబులైన యు
                       పాయము ల్బోధించి ప్రాజ్ఞుఁ జేసి
నిర్వహించెద మతినిపుణతరోక్తుల;
                       నవి వినకున్న దురాత్ము మదియ


తే. గీ.

శాప మిచ్చెద; ముడుగుమీ సాహసోక్తి
స్వామి! యీతుడు శస్త్రాళి సమయకునికి
యద్భుతము గాదు, తద్బలోదయము; దాని
యౌషధంబు నెఱుంగుదు మసురనాథ!

158


క.

అన్నియు నన నేటికి లో
కోన్నతశీలుఁడవు తావకోగ్రక్రోధో
త్పన్నపరాధమున కితం
డెన్నిక నర్హుండె దానవేశ్వర! యింకన్.

159


తే. గీ.

అని కుమారునిఁ దోడ్కొని యపుడు తత్పు
రోహితులు విజనన్దలి నూహ సేయఁ
జనిరి; యాపత్ప్రణాశనుఁ జక్రహస్తు
నతఁడు మదిలోఁ దలంపుచు నచట నిలిచె.

160
  1. యితనిపై