ఇట్లు మహాభీలజ్వాలాకరాళంబైన యుగాంతానలంబునుంబోలె
ననంతానలం బుప్పొంగఁ దదంతరంబు చొచ్చి జలశాయిం దలంపుచు
నంతర్బలంబున జగన్నాయకుండు నాయందుఁ గలండని చింతింపుచు
నున్న నవలంబు శాంతమొందె. అంత జలంబులం దోఁగినయట్లనున్న
నసురులు విస్మయం బంది మఱియుఁ గ్రాలుకొనం జేసిన
పొనుంగుపడి సాధుశిష్యుండు గురునియొద్దంబలె, సర్పంబులు
వినతాసుతునియొద్దంబలె, హరిధ్యానపరాయణుండైన యతని
యొద్ద నిరంగారంబై యుండె; భవాగ్ని తపింపంజేయలేదు, వైష్ణవులం
బ్రాకృతాగ్ని తపింపంజేయగలదె? అట్లుగాన నతండు సుఖంబున
నుండుట విని యారాజు రోషించి మృత్యుజిహ్వాభీలంబైన కరవాలం
బెత్తి వైవం జూచిన పురోహితు లతనిం జూచి యంజలిఁ జేసి యిట్లని
వినుతించి రప్పుడు.