పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/671

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


దోరుధారలు వోయి, ధారాళతరరక్త
                       ధారలు దొరఁగ, నార్తస్వనమున
రోదసీకుహరంబు భేదింప, దుర్భయ
                       కంపంబుచే దైత్యకర్త బెదర,


తే. గీ.

ననలమును శలభంబులు, నద్రిరాజు
దంశము; లిభంబు నజము; లాత్మజ్ఞులోక
ములునుబోలెఁ దెరల్ప నాజలజనాభ
భక్తినిష్ఠాపరాయణు భవ్యు నతని.

150


వ.

అప్పుడు.

151


క.

దైత్యుల రమ్మని యంతట
దైత్యవరేణ్యుండు మీరు దహనజ్వాలౌ
ద్ధత్యంబున నణఁచుం డని
యత్యంతాగ్రహముతోడ ననిచె న్వేగన్.

152


వ.

వారు చని.

153


శా.

కాష్ఠాచక్రము కంప మంద నమలోగ్రస్ఫారరోషాగ్నిచేఁ
గాష్ఠానీకము తైలవాహినులఁ దోఁగంజేసి దుర్జ్వాలికా
కాష్ఠాభీలమహానలచ్ఛటల మ్రగ్గం ద్రోచినం భీతులై
కాష్ఠాధీశులు వేగఁ గన్నదరి వీగం జొచ్చి రత్యుద్ధతిన్.

154


వ.

ఇట్లు మహాభీలజ్వాలాకరాళంబైన యుగాంతానలంబునుంబోలె
ననంతానలం బుప్పొంగఁ దదంతరంబు చొచ్చి జలశాయిం దలంపుచు
నంతర్బలంబున జగన్నాయకుండు నాయందుఁ గలండని చింతింపుచు
నున్న నవలంబు శాంతమొందె. అంత జలంబులం దోఁగినయట్లనున్న
నసురులు విస్మయం బంది మఱియుఁ గ్రాలుకొనం జేసిన
పొనుంగుపడి సాధుశిష్యుండు గురునియొద్దంబలె, సర్పంబులు
వినతాసుతునియొద్దంబలె, హరిధ్యానపరాయణుండైన యతని
యొద్ద నిరంగారంబై యుండె; భవాగ్ని తపింపంజేయలేదు, వైష్ణవులం
బ్రాకృతాగ్ని తపింపంజేయగలదె? అట్లుగాన నతండు సుఖంబున
నుండుట విని యారాజు రోషించి మృత్యుజిహ్వాభీలంబైన కరవాలం
బెత్తి వైవం జూచిన పురోహితు లతనిం జూచి యంజలిఁ జేసి యిట్లని
వినుతించి రప్పుడు.

155