పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/670

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


ఉ.

కాన సుఖస్థితిన్ నిలువఁగల్గిన యప్పుడె దుర్గతిక్రియా
హానికినై భజింపఁదగు నంబుజనేత్రు; రమాకళత్రు; భ
క్తానిశసత్ఫలప్రదు; బుధాత్మమనోత్సవమూర్తి; విష్ణు, లో
నూనిన భక్తిచే మఱి నరోత్తముఁడైన ఘనుండు ధన్యుఁడై.

145


క.

ఈరీతిఁ బల్క విని యమ
రారి సహింపక మదోత్కటాహంకృతిఁ దాఁ
జీరుకము చూతకిసలా
హారముఁ గొని యసహమానమై యున్నగతిన్.

146

హిరణ్యకశిపుఁడు ప్రహ్లాదుని గజములఁ ద్రొక్కించుట

వ.

అప్పుడు పూర్వాపరపరామర్శశూన్యుండై క్రోధానలవ్యాకులుండై
యతిదుర్దమంబులగు దిగ్గజంబులం బిలిచి యీకులద్రోహిని వధింపుఁడు.
హతుండై మద్భుజాబలాహతులైనవారల విలోకించుం గాక; అల్ప
కార్యంబునందు నియోగించితినని లజ్జించవలవదని యానతి
యిచ్చిన విని చని.

147


శా.

శుండాదండము లెత్తి మొత్తి, రదనక్షుణ్ణాంగుఁగాఁ గ్రుమ్మి యు
చ్చండాంఘ్రిస్ఫురితాహతిం జిదిమి, చంచద్ఘోరఘీంకారముల్
దండిన్ బద్మభవాండమండలసముద్దండార్భటిన్ నిండ ది
క్ఛుండాలంబులు తత్కయాధుతనయుం గ్రూరోద్ధతిం దాఁకినన్.

148


మ.

కులశైలంబులు నాగవేధులు మహాక్రూరంబులై యొప్పఁగా
బలసంపత్తి యనల్పమై నిగుడ, శుంభద్ఘోరదిఙ్నాగముల్
జలజాక్షున్ హృదయంబులో నిలిపి యుచ్చైర్గౌరవాటోపముల్
గల ప్రహ్లాదుఁ దరల్పలేక నిలిచెన్ గంభీరఘోరంబుగన్.

149


సీ.

అంత దిక్కరులు రోషాటోపమునఁ గ్రూర
                       దంతశూలములఁ దద్దైత్యబాలుఁ
దతపూర్వతనువులై యతివేగమునఁ గ్రుమ్మ;
                       దంతముల్ విరిగి యాధరణిఁ బడి; మ