పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/663

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


బతనియంగం బని విన్నవించిన మంత్రులుం దానును జింతించి
యితండు దండసాధ్యుండు గాఁడని సాంత్వనమునం దలచి
పిలిచి సుతునితో నిట్లనియె.

118


సీ.

ప్రహ్లాద! దుష్టస్వభావుండ వైన నా
                       కాత్మజుండవు నిన్ను హాని సేయఁ
దలఁచిన నామది దయపుట్టె; భీకరో
                       రగదైత్యపతులదుర్వారశక్తి
వెఱపింపఁ బంచితి; విశసించుమనిన ని
                       న్నెవ్వరు రక్షింతు? రిప్పు డే న
నుగ్రహించితి; నిన్ను నిగ్రహానుగ్రహ
                       శక్తునిఁగా నాత్మ సమ్మతింపు;


తే. గీ.

పేరు పెంపును రూపంబు బిరుదు లేని
హరి భజింతి; వికఁనైన నతని విడువు;
రాజదయ నిత్యమని నమ్మరా; దకార్య
కరణమున శిక్ష సేయుదు రరులువోలె.

119


వ.

కావున నస్మద్విరోధి నాశ్రయించి యేమి యనుభవించెదవు? తన
యంతనె సకలవైభవంబులు గలిగియున్నవాఁడవు; మూర్ఖత వదలు
మని తండ్రి పలికిన విగుర్వవచనంబులు విని పరమభాగవతుం
డిట్లనియె.

120


ఉ.

వాసిగ నీవు పల్కు నయవాక్యము లన్నియు వేయుమార్లు నేఁ
జేసెద; నింక నాత్మబలచింతన లేక పరాశ్రయంబుచే
గాసిల నేల వీఁడు ? రిపుగంథములం దివి హృద్యసంపదన్
భాసిలునట్టి వాక్యములు; పల్కక యుండినఁ దోఁచు నెప్పుడున్.

121


వ.

అరివర్గ [1]మన నరిషడ్వర్గంబు గాని వేఱె లేదు. పాపతరంబైన యీయరి
షడ్వర్గంబు స్వాధీనంబగు నానందంబుఁ బొందనీయదు.కామాది
వంచితుండై యాజనుండు ప్రకృతియుక్తంబగు స్త్రీప్రసంగంబున
భ్రాంతుండై పితృమాతృపక్షంబు వదిలినట్లు శ్రీమన్నారాయణుని
వదలియుండు. వేయింట నొక్కరుండు విరక్తుండై హరిభజనంబు

  1. మందె