పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆ బ్రహ్మరాక్షసత్వం పోవడం, తద్రూపంగా విష్ణుభక్తిమాహాత్మ్యాన్ని వివరించడం జరిగింది.

ప్రహ్లాదుని విద్యాభ్యాసవర్ణనాసందర్భంగా - నరసింహావతారానికి పూర్వమే విష్ణువు నుద్దేశించి - యీ క్రిందిపద్యంలో కృష్ణావతారం జరగకముందే 'కృష్ణ' శబ్దాన్ని ప్రయోగించాడు.

"ఘనదైవపౌరుషాగత
ధనమంతయు నాశ్రితజనతతి వీడ్కొని తా
ననుభవమునకుం గొనుపా
వని కృష్ణుఁడు జగతిలోన ఒక వృత్తి యగున్..

(నార. 442. పు. 223. ప.)

దీనివల్ల కృష్ణావతారానికి పూర్వమే విష్ణువుకు కృష్ణనామం వున్నదని మనం ఆమోదించవలసి వస్తుంది. విష్ణువును మహత్తరదైవస్వరూపునిగా మనం ఆమోదించినపుడు అతని సహస్రనామాత్మునిగా సైతం ఆమోదించి కృష్ణావతారానికి పూర్వమే విష్ణువుకు కృష్ణనామం వున్నట్లు మనం ఆమోదించవలసి వుంటుంది. నారదీయపురాణం భవిష్యద్వాణిగా నారదప్రోక్తంగా మనం ఆమోదించినప్పుడు సైతం భవిష్యత్తులో రాబోయే రామ, కృష్ణావతారాల గురించి నారదుడు చెప్పడం సమంజసమే కాబట్టి విష్ణుపరంగా కృష్ణశబ్దాన్ని ప్రయోగించడంలో మనకు విప్రతిపత్తి యేమీ కనిపించదు.

విశిష్ట విషయాలు

నరసింహకవి కృత్యవతారికలో కృతిపతి అయిన శ్రీకృష్ణుని అవతారవిశేషాలను అనేకవిధాలుగా దాదాపు కృష్ణచరిత్రను వర్ణనారూపంగా చిత్రీకరించాడు. శ్రీకృష్ణ జాంబవంతులకు జరిగిన యుద్ధంలో జాంబవంతుడు ఓడిపోయిన తరువాత అతనికి శ్రీకృష్ణుడు శ్రీ మహావిష్ణువుగానే కాక శ్రీరామచంద్రుడుగాసైతం కనిపించినట్లు ఈ క్రింది పద్యంలో స్పష్టంగా జాంబవంతుని స్తుతిరూపంలో వర్ణించాడు.

<poemజాంబవంతుఁ డాత్మశక్తి జయించిన

శక్తి గలుగు కృష్ణు జగముఁ బ్రోచు నాదిదేవుఁ డా చరాచరకర్త నా

రాయణుండె యనుచుఁ బ్రస్తుతించె.</poem>