| "తెలిపగఁ ద్రిపాద్విభూతి నతిక్రమించి | |
(నార. 344 పు : 113. ప)
ఉపనిషద్విద్యలపరంగా నరసింహకవి వివిధ ఆవరణల విషయాలను పండితైకవేద్యంగా, వేదవేదాంతవేద్యంగా, అతివిపులంగా వర్ణించాడు.
| ఏ యే యావరణంబుల | |
(నార. 345. పు : 120. ప)
అని శకునిచేత ప్రశ్నింపజేసి పంచావరణాగణ్యనియతలోకాలను పరాశరాత్మజునిద్వారా, ప్రకృష్ణంగా తెలియజేశాడు. వైష్ణవుల వైశిష్ట్యం గురించి వర్ణించే సందర్భంలో "ఇది మొదలుగా నేతద్వాక్యోప బృంహిత మహోపనిషదాద్యుపనిషత్తులయందును హరి లాంఛనంబు వహింపఁగా వలయునని వినంబడియె మరియు" (నార. 351 పు : 136. వ.). వైష్ణవ ప్రతికూలానుకూలానుభయభేదాలను వివరించే సందర్భంగా -
| "గురుభక్తిమైఁ బ్రతికూలానుకూలాను | |
(నార. 353. పు : 150 ప.)
అని వైష్ణవవిభేదాలన్నీ ఉపనిషన్మతసమ్మతాలుగానే పేర్కొన్నాడు. అనంతరం వేదాంతమతవైశిష్ట్యం గురించి వివరిస్తూ "బాహ్యదృష్టులు లేని దేశంబునకుం జని నైమిశాది పుణ్యక్షేత్రంబుల విజ్వరులై పరబ్రహ్మోపనిషద్భావనం గొందరు ప్రవర్తిల్లుదురు" (నార. 377. పు : 247. వ.) అని పరబ్రహ్మోపనిషద్విషయాన్ని ఉదాహరించాడు. తరువాత ఉపనిషద్పక్షవ్యతిరేకులైన దుష్టులు సత్పురుషులను దుర్మార్గాలలో యేవిధంగా పెడతారో పేర్కొంటూ "మరియు